Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో రూ.70వేలు దాటిన పసిడి

Gold Rates | కొనుగోలుదారులకు బంగారం ధరలు మళ్లీ షాక్‌ ఇచ్చాయి. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన ధరలు శనివారం బులియన్‌ మార్కెట్‌లో పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 పెరిగి తులానికి రూ.64,450కి ఎగిసింది.

Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో రూ.70వేలు దాటిన పసిడి

Gold Rates | కొనుగోలుదారులకు బంగారం ధరలు మళ్లీ షాక్‌ ఇచ్చాయి. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన ధరలు శనివారం బులియన్‌ మార్కెట్‌లో పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 పెరిగి తులానికి రూ.64,450కి ఎగిసింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.220కి ఎగిసి తులానికి రూ.70,310కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో పసిడి 22 క్యారెట్ల తులానికి రూ.64,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.70,310 పలుకుతున్నది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.64,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.70,460కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.64,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.70,310కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.64,450 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.70,310కి ఎగిసింది.

ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి సైతం స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.100 చొప్పున పెరిగింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలోకు రూ.83,100 తగ్గింది. హైదరాబాద్‌లో కిలోకు రూ.88,100కి చేరింది. ఇదిలా ఉండగా.. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.