Rahul Gandhi | మోదీ 3.O ప్రభుత్వంలో రాహుల్ గాంధీకి భారీ లాభాలు..! అదెలా అంటే..?
Rahul Gandhi | నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మరో వైపు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంపద పెరుగుతూ వస్తున్నది. ఇదేంటీ మోదీ ప్రభుత్వంలో రాహుల్ సంపద పెరగడమా? అనే అనుమానం వచ్చే ఉంటుంది. మీరు చదివింది నిజమే.

Rahul Gandhi | నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మరో వైపు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంపద పెరుగుతూ వస్తున్నది. ఇదేంటీ మోదీ ప్రభుత్వంలో రాహుల్ సంపద పెరగడమా? అనే అనుమానం వచ్చే ఉంటుంది. మీరు చదివింది నిజమే. మోదీ 3.O ప్రభుత్వం వచ్చాక రాహుల్ స్టాక్ మార్కెట్ల వృద్ధిపై అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో రాహుల్ గాంధీ తన పెట్టుబడుల ద్వారా రూ.46.49లక్షల సంపాదించినట్లు ఓ డేటా పేర్కొంది. ఈ ఏడాది మార్చి 15 నాటికి రాహుల్ గాంధీకి స్టాక్ మార్కెట్లో రూ.4.33 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. రాహుల్ లోక్సభ ఎన్నికల సమయంలో రాయ్బరేలీ నియోజకవర్గంలో వేసిన నామినేషన్లో తన షేర్ల వివరాలు వెల్లడించారు. వీటి ఆధారంగా రాహుల్ గాంధీ స్టాక్స్ వాల్యూను లెక్కించారు.
ప్రస్తుతం ఆయన షేర్ల విలువ ఈ నెల12 నాటికి రూ.4.80కోట్లకు చేరింది. రాహుల్ గాంధీ పోర్ట్పోలియోలో ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫైనాన్స్, దీపక్ నైట్రేట్, దివిస్ ల్యాబ్స్, జీఎంఎం పిఫాడ్లర్, హిందూస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, టైటాన్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా, ఎల్టీఐ మైండ్ ట్రీ తదితర 24 స్టాక్స్లో పెట్టుబడి పెట్టారు. ఎల్టీఐ మైండ్ ట్రీ, టైటాన్, టీసీఎస్, నెస్లే ఇండియా స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. మిగతా అన్ని స్టాక్స్ లాభాల్లోనే ఉన్నాయి. వెర్డోజ్ అడ్వర్టైజ్మెంట్ లిమిటెడ్, వినైల్ కెమికల్స్ తదితర చిన్న కంపెనీల స్టాక్స్లోనూ ఆయన పెట్టుబడులు పెట్టారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టింది. ఆ తర్వవాత స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత కొన్ని నెలల్లోనే పలు రికార్డులను నమోదు చేస్తూ కొత్త గరిష్ఠాలను చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం నుంచి సెన్సెక్స్ 11 శాతం, నిఫ్టీ 12 శాతం వృద్ధిని నమోదు చేశాయి.