NTR| ఈ ఎన్నికలలో జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడి కూటమి అధికారంలోకి రావడం మనం చూశాం. ఇక ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు ముహూర్తం ఫిక్స్ చేశారు. గన్నవరం విమానాశ్రయంకు సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ లో సరిగ్గా ఉదయం 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు నాయుడుచే రాష్ట్ర గవర్నర్ జస్టిస్ నజీర్
NTR| ఈ ఎన్నికలలో జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడి కూటమి అధికారంలోకి రావడం మనం చూశాం. ఇక ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు ముహూర్తం ఫిక్స్ చేశారు. గన్నవరం విమానాశ్రయంకు సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ లో సరిగ్గా ఉదయం 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు నాయుడుచే రాష్ట్ర గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారధులు హాజరు కానున్నట్టు సమాచారం. ప్రధాని మోడీ, అమిత్ షా వంటి పలువురు దేశ నాయకులు ఈ ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సినిమా పరిశ్రమ నుంచి కూడా పలువురుకి ఆహ్వానాలు అందాయి. మెగాస్టార్ చిరంజీవిని విశిష్ట అతిథిగా చంద్రబాబు ఆహ్వానించారు. ఈ క్రమంలో చిరంజీవి తన భార్య సురేఖ, కూతురు శ్రీజ, ఆమె ఇద్దరు కూతుళ్లు, పవన్ కూతురు ఆద్యతో చిరంజీవి గన్నవరం చేరుకున్నారు. ఇక రామ్ చరణ్కి కూడా ఆహ్వానం అందినట్టు వార్తలు వినిపిస్తుండగా, ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉందని టాక్. అయితే నందమూరి ఫ్యామిలీ హీరోకి ఆహ్వానం అందిందా, ఒకవేళ అందితే ఆయన హాజరు అవుతారా లేదా అనే సందేహాలు ఇప్పుడు అభిమానుల్లో చాలా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్కి ఆహ్వానం పంపారు అని కొందరు చెబుతుండగా, మరి కొందరు ఆహ్వానమే పంపలేదని అంటున్నారు.
గత కొన్నాళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలకి హాజరు కావడం లేదు. ఈ క్రమంలోనే అతనికి ఆహ్వానం పంపలేదనే టాక్ వినిపిస్తుంది. తారక్ని చంద్రబాబు దూరం పెట్టడం, బాబాయ్ బాలయ్యతోనూ విభేదాలు ఉండడం, నారా, నందమూరి ఫ్యామిలీలతో ఎన్టీఆర్కి కొంత గ్యాప్ రావడం వల్లనే ఎన్టీఆర్ ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని టాక్. అయితే ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. మామయ్య అంటూ చంద్రబాబుకి విషెస్ తెలిపారు. లోకేష్కి, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, మోడీలకు ఆయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్ర షూటింగ్లో బిజీగా ఉండగా, ఈ మూవీ గోవా సమీపంలో చిత్రీకరణ జరుపుకుంటుంది.