లారీలోని ధాన్యం బస్తాలు కారుపై పడి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామశివారు అపెక్స్ కాలేజీ వద్ద
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: లారీలోని ధాన్యం బస్తాలు కారుపై పడి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామశివారు అపెక్స్ కాలేజీ వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. నర్సంపేట మండలం రామారం గ్రామానికి చెందిన జినుకుల నాగరాజు, అతని భార్య లలిత, కుమారుడు శ్రీకాంత్, కోడలు సింధూలతో కలిసి హనుమకొండ రామారంలోని తన కుమార్తె కుమారుడు (మనుమడు) పుట్టు వెంట్రుకలు తీసేందుకు శుక్రవారం వేములవాడకు వెళ్లారు.
అక్కడ నుంచి శనివారం కొండగట్టు అంజన్న దర్శనం చేసుకొని సాయంత్రం 8 గంటల సమయంలో హనుమ కొండకు చేరుకున్నారు. కుమార్తె, అల్లుడిని ఇంటిదగ్గర వదిలేసి నర్సంపేట మండలం రామారానికి కారులో బయల్దేరారు. రాత్రి గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామశివారు అపెక్స్ కాలేజీ దాటి వెళ్తుండగా నర్సంపేట నుంచి ఎదురుగా వరంగల్ వైపు ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీలోని బస్తాలు ఒక్కసారిగా కారుపై పడ్డాయి. దీంతో రాజు(60) అక్కడికక్కడే మృతిచెందారు. అతని భార్య జినుకుల లలిత, కుమారుడు శ్రీకాంత్, కోడలు సింధూలకు తీవ్ర గాయాలయ్యాయి. లారీలోని బస్తాలు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్ స్తంభించింది. స్థానికుల సమాచారం మేరకు నర్సంపేట 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు చికిత్స అందించి ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ముగ్గురికి తలలకు తీవ్ర గాయాలైనట్లు ఎంజీఎం వైద్యులు తెలిపారు.