Karimnagar: 15,81,900 నగదు పట్టివేత

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా, అక్రమ డబ్బు, మద్యం సరఫరా అరికట్టేందుకు పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్ లోని వివిధ ప్రాంతాలలో సరైన ఆధారాలులేని

  • Publish Date - April 19, 2024 / 07:10 PM IST

విధాత బ్యూరో, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా, అక్రమ డబ్బు, మద్యం సరఫరా అరికట్టేందుకు పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్ లోని వివిధ ప్రాంతాలలో సరైన ఆధారాలులేని 15,81,900 రూపాయలను పట్టుకుని స్వాధీన పరుచుకున్నామన్నారు.

కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని రాజీవ్ చౌక్ వద్ద దకరీంనగర్ దుర్గమ్మగడ్డకు చెందిన జనగం సుమన్ కళ్యాణ్ నుండి 7,00, 000 రూపాయలు, కరీంనగర్ టూ టౌన్ పరిధిలోని గీతాభవన్ చౌరస్తా వద్ద మానకొండూర్ కి చెందిన నెల్లి భాస్కర్ నుండి 1,11,900 రూపాయలు, ఐబీ చౌరస్తా వద్ద, కరీంనగర్ కోతిరాంపూర్ కు చెందిన కొల ప్రదీప్ కుమార్ వద్ద నుండి 6,81,900. రూపాయలు,
కరీంనగర్ త్రీ టౌన్ పరిధిలోని నిర్వహించిన తనిఖీల్లో కట్టారాంపూర్ కి చెందిన గాండ్ల సురేష్ నుండి 2,00,000 రూపాయలను స్వాధీన పరుచుకుని తదుపరి ప్రక్రియ కోసం ఆ మొత్తాన్ని సంబంధిత అధికారుల వద్దకు పంపించామని ఇన్స్పెక్టర్లు జె సరిలాల్, విజయ్ కుమార్, జాన్ రెడ్డి లు తెలిపారు.

Latest News