ముగ్గురు అరెస్టు…రూ.48.58 లక్షల విలువ చేసే గుట్కా పట్టివేత విధాత :అనంతపురం జిల్లా మడకశిర పోలీసులు భారీ ఎత్తున నిషేధిత గుట్కా పదార్థాలు, లిక్కర్ పట్టుకున్నారు. ముగ్గుర్ని అరెస్టు చేసి రూ. 48.58 లక్షల విలువ చేసే గుట్కా, ఐచర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండ డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా వివరాలను మీడియాకు వెల్లడించారు.మడకశిర మండల పరిధిలోని యు.రంగాపురం చెక్ పోస్టు వద్ద మడకశిర ఎస్సై శేషగిరి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో […]
ముగ్గురు అరెస్టు…రూ.48.58 లక్షల విలువ చేసే గుట్కా పట్టివేత
విధాత :అనంతపురం జిల్లా మడకశిర పోలీసులు భారీ ఎత్తున నిషేధిత గుట్కా పదార్థాలు, లిక్కర్ పట్టుకున్నారు. ముగ్గుర్ని అరెస్టు చేసి రూ. 48.58 లక్షల విలువ చేసే గుట్కా, ఐచర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండ డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా వివరాలను మీడియాకు వెల్లడించారు.
మడకశిర మండల పరిధిలోని యు.రంగాపురం చెక్ పోస్టు వద్ద మడకశిర ఎస్సై శేషగిరి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో తుముకూరు నుండి తెలంగాణ రాష్ర్టానికి ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా, లిక్కర్ ను గుర్తించి సీజ్ చేశారు. బెంగుళూరుకు చెందిన సయ్యద్ ఫజల్, ఇర్షాద్ లు… మైసూర్ కు చెందిన సయ్యద్ అమీన్ అహ్మద్ అనే ముగ్గురు వ్యక్తులు కొంతకాలంగా మడకశిర మీదుగా తెలంగాణ రాష్ర్టానికి అక్రమంగా గుట్కా మద్యం ను తరలిస్తున్నారు. ఈ సమాచారంతో నిఘా వేసి వీరిని పట్టుకున్నారన్నారు.120 సంచులలో నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా పదార్థాలు తరలిస్తున్నారు. వీటి విలువ దాదాపు రూ. 48,58,000/- లు ఉంటుంది. అంతేకాకుండా…192 కర్నాటక మద్యం పాకెట్లు సీజ్ చేశారు.