కాపురానికి రాన‌న‌డంతో భార్య‌తో పాటు అత్త‌ను,మ‌ర్ద‌లిని పొడిచి చంపిన భ‌ర్త‌

విధాత‌: కర్ణాటకలోని రాయచూరులో దారుణం చోటు చేసుకుంది. అల్లుడి చేతిలో తల్లీ కూతుళ్లు హత్యకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తాలూకాలోని యరమరాస్‌లో ఈ దారుణఘ‌ట‌ణ‌ చోటుచేసుకుంది. వివరాలు.. యరమరాస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద నివాసం ఉంటున్న పారిశుధ్య కార్మికురాలు సంతోష్‌​ (45)కి వైష్ణవి(25), ఆరతి(16) కూతుళ్లు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాయి అనే యువకుడితో పెద్దకూతురు వైష్ణవికి వివాహం జరిపించారు. సాయి హైదరాబాద్‌లో వడ్డీ వ్యాపారి. పెళ్లయినప్పటి నుంచి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. […]

కాపురానికి రాన‌న‌డంతో భార్య‌తో పాటు అత్త‌ను,మ‌ర్ద‌లిని పొడిచి చంపిన భ‌ర్త‌

విధాత‌: కర్ణాటకలోని రాయచూరులో దారుణం చోటు చేసుకుంది. అల్లుడి చేతిలో తల్లీ కూతుళ్లు హత్యకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తాలూకాలోని యరమరాస్‌లో ఈ దారుణఘ‌ట‌ణ‌ చోటుచేసుకుంది. వివరాలు.. యరమరాస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద నివాసం ఉంటున్న పారిశుధ్య కార్మికురాలు సంతోష్‌​ (45)కి వైష్ణవి(25), ఆరతి(16) కూతుళ్లు.

ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాయి అనే యువకుడితో పెద్దకూతురు వైష్ణవికి వివాహం జరిపించారు. సాయి హైదరాబాద్‌లో వడ్డీ వ్యాపారి. పెళ్లయినప్పటి నుంచి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో ఇటీవల వైష్ణవి పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి సాయి అత్తవారింటికి వచ్చాడు. తనతో హైదరాబాద్‌కు రావాలని భార్యను ఒత్తిడి చేయడంతో ఆమె రానన్నది.

ఈ క్రమంలో ఉన్మాదిగా మారిన సాయి భార్యను, అడ్డు వచ్చిన అత్త సంతోషిని, మరదలు ఆరతిని కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో బాధితులు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు. అర్ధరాత్రి సమయం కావడంతో అందరూ నిద్రలో ఉన్నందున ఘటన గురించి ఎవరికీ తెలియలేదు. బుధవారం ఉదయం సంతోషి బంధువులు పనిమీద ఇంటికి రాగా రక్తపు మడుగులో ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. అక్కడికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్పీ శ్రీహరి బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. రాయచూరు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి హంతకుడి కోసం గాలింపు చేపట్టారు. అతడి కోసం హైదరాబాద్‌కు పోలీసు బృందాలు వచ్చాయి.