పేకాట రాయుళ్లపై పంజా విసిరిన పోలీసులు.

పెద్ద మొత్తములో నగదు,కార్లు,మొబైల్ ఫోన్లు,మోటార్ బైకులు స్వాదీనం…..నిందితులు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవని హెచ్చరించిన పోలీస్ అధికారులు….చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి….విధాత:SEB పోలీసులు మరియు గుంటూరు రూరల్ పోలీసులు సంయుక్తముగా నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి, భారీ మొత్తములో నగదు,కార్లు,మోటార్ వాహనాలు,సెల్ ఫోన్లు మొదలగు వాటిని స్వాదీనం చేసుకుని, పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకోవడం జరిగినది.ది.28.05.2021 తేదీన నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతరేవు గ్రామమునకు వెళ్ళే […]

పేకాట రాయుళ్లపై పంజా విసిరిన పోలీసులు.

పెద్ద మొత్తములో నగదు,కార్లు,మొబైల్ ఫోన్లు,మోటార్ బైకులు స్వాదీనం…..
నిందితులు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవని హెచ్చరించిన పోలీస్ అధికారులు….
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి….

విధాత:SEB పోలీసులు మరియు గుంటూరు రూరల్ పోలీసులు సంయుక్తముగా నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి, భారీ మొత్తములో నగదు,కార్లు,మోటార్ వాహనాలు,సెల్ ఫోన్లు మొదలగు వాటిని స్వాదీనం చేసుకుని, పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకోవడం జరిగినది.
ది.28.05.2021 తేదీన నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతరేవు గ్రామమునకు వెళ్ళే దారిలోనున్న భూశంకర్ రావు అనే వ్యక్తి యొక్క రొయ్యల చెరువు వద్దగల ఒక షెడ్డులో నిర్వహించుచున్న పేకాట శిబీరముపై రేపల్లె టౌన్ సిఐ గారు మరియు నగరం SEB SI గారుల నేతృత్వంలో సంయుక్త దాడులు నిర్వహించి,అందులో పేకాట(కోతముక్క)ఆడుతున్న 21 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగినది.
ఈ దాడిలో రూ.42,58,420/- నగదును,1- నగదు లెక్కింపు యంత్రాన్ని,27 బాక్సుల పేక ముక్కలను,153 ప్లాస్టిక్ నాణేలను,32 మొబైల్ ఫోన్లు,22 కార్లు,8 మోటార్ బైకులను, 10 కుర్చీలను,3 టేబుళ్లను,1- విద్యుత్ జనరేటర్ ను స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేయడం జరిగినది.

అదేవిధముగానిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముండ్రేడు గ్రాముములో మోపిదేవి నాగరాజు అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్డు నందు నిర్వహిస్తున్న పేకాట(కోతముక్క) స్థావరంపై బాపట్ల రూరల్ సీఐ మరియు నగరం SEB SI గారి నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 58 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగినదని తెలిపారు.

ఈ దాడిలో రూ.6,17,145/- నగదును,1 – నగదు లెక్కింపు యంత్రాన్ని,20 కార్లను,16 మోటార్ బైకులను,46 మొబైల్ ఫోన్లను,1 ఆటో,2 – జనరేటర్లను,480 పేక ముక్కల బాక్సులను,580 ప్లాస్టిక్ కుర్చీలు,27 ప్లాస్టిక్ టేబుళ్లను స్వాదీనం చేసుకోవడం జరిగినదని తెలిపారు.

ఈ రెండు దాడులలో రూ.48,75,565 /- నగదును,2 – నగదు లెక్కింపు యంత్రాన్ని,42 కార్లను,24 మోటార్ బైకులను,78 మొబైల్ ఫోన్లను,1 ఆటో,3 – జనరేటర్లను,507 పేక ముక్కల బాక్సులను,153 ప్లాస్టిక్ కాయిన్లను,590 ప్లాస్టిక్ కుర్చీలు,30 ప్లాస్టిక్ టేబుళ్లను స్వాదీనం చేసుకోవడం జరిగినదని తెలిపారు.
పేకాట వంటి చట్టవ్యతిరేక ఆటలు ఆడే వారే కాకుండా ఆడటానికి సహకరించడం,ఆడించడం,చూడడం, ఆట ఆడేవారికి కాపలా కాయడం వంటి చర్యలకు పాల్పడే వారిని కూడా ఆంధ్ర ప్రదేశ్ గేమింగ్ యాక్టు కింద ముద్దాయిలు గా భావించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలు ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరముగా ఉండాలని తెలిపారు.

ఒక వైపు కరోనా మహమ్మారి వీజుంభిస్తున్న నేపథ్యంలో ప్రజా రక్షణే ద్వేయముగా పోలీసులు విధులు నిర్వహిస్తున్న తరుణంలో కొంతమంది అక్రమార్కులు ఇదే అదనుగా భావించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని,అటువంటి వారి సమాచారం ఉంటే వెంటనే SEB కంట్రోల్ రూమ్ నంబర్ 9490619395 కు సమాచారం ఇవ్వాలని,సమాచారం ఇచ్చిన వారు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీస్ అధికారులు గుంటూరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు