అత్తాపూర్ పిస్తా హోటల్లో రౌడీ షీటర్ల వీరంగం

రాజేంద్రనగర్ అత్తాపూర్ పిస్తా హౌజ్ హోటల్లో రౌడీ షీటర్ల వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించి భోజనం చేస్తున్న వారి పై దాడికి పాల్పడ్డారు

అత్తాపూర్ పిస్తా హోటల్లో రౌడీ షీటర్ల వీరంగం

భోజనం చేస్తున్న వారిపై దాడి

విధాత, హైదరాబాద్ : రాజేంద్రనగర్ అత్తాపూర్ పిస్తా హౌజ్ హోటల్లో రౌడీ షీటర్ల వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించి భోజనం చేస్తున్న వారి పై దాడికి పాల్పడ్డారు. హోటల్లోకి వచ్చిన 17 మంది రౌడీ గ్యాంగ్ సభ్యులు మొబైల్ ఫోన్‌లో వీడియోలు తీస్తూ రెచ్చిపోయారు. అకారణంగా హోటల్లో ఉన్న సామాగ్రి ధ్వంసం చేసి భోజనం చేస్తున్న యువకులపై పిడు గుద్దుల వర్షం కురిపించారు. భయంతో బాధిత యువకులు బయటకు పరుగులు తీశారు. దాడిని అడ్డుకోబోయిన సిబ్బందిపై కూడా రౌటీ షీటర్లు దాడికి దిగారు. రౌడీ షీటర్ల దాడితో కస్టమర్స్, యాజమాన్యం భయభ్రాంతులకు గురయ్యారు. దాడి ఘటనపై హోటల్ యాజమాన్యం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.