బ్యాంకును సక్రమంగా నడపాల్సింది పోయి తనను నమ్మిన ఖాతాదారులనే ముంచేశాడో బ్యాంకు మేనేజర్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లోని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో పనిచేస్తున్న బ్యాంకు మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు.
విధాత : బ్యాంకును సక్రమంగా నడపాల్సింది పోయి తనను నమ్మిన ఖాతాదారులనే ముంచేశాడో బ్యాంకు మేనేజర్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లోని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో పనిచేస్తున్న బ్యాంకు మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. వాహనాల కొనుగోలుకు రుణాలను తీసుకున్న వారిని నిండా ముంచాడు. వాహనాల లోన్ల తాలుకూ డబ్బులను చెల్లించేందుకు బ్యాంకుకు వచ్చిన వారికి ఎలాంటి రశీదు ఇవ్వకుండా తానే డబ్బులు కాజేశాడు. పదుల సంఖ్యలో బాధితుల నుంచి లక్షల రూపాయల లోన్ల అమౌంట్ ను తానే నేరుగా తీసుకున్నాడు. ఈ వ్యవహారం బయటపడటంతో ఖతాదారులు, ఈఎంఐలు చెల్లించిన వారు లబోదిబో మంటున్నారు. మేనేజర్ నిర్వాకంపై ఉన్నతాధికారులు విచారణ సాగిస్తున్నారు.