Bananas | అరటి పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగితే సమస్యలొస్తాయా? ఇందులో నిజమెంత?
Bananas | అరటి పండ్లను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. కాలమేదైనా అందరికీ అందుబాటులోనే ఉంటాయి. దీంతో ఎక్కువ మంది అరటి పండ్లను కొని తింటుంటారు. అయితే, పండ్లపై చాలా మందిలో ఓ సందేహం వ్యక్తమవుతుంది. అదేంటంటే.. అరటి పండ్లను తిన్న అనంతరం మంచినీళ్లు తాగొచ్చా? ఒక వేళ పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగితే ఏమైనా అవుతుందా? అనారోగ్య సమస్యలు ఎదురవుతాయా? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతుంటాయి.

Bananas | అరటి పండ్లను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. కాలమేదైనా అందరికీ అందుబాటులోనే ఉంటాయి. దీంతో ఎక్కువ మంది అరటి పండ్లను కొని తింటుంటారు. అయితే, పండ్లపై చాలా మందిలో ఓ సందేహం వ్యక్తమవుతుంది. అదేంటంటే.. అరటి పండ్లను తిన్న అనంతరం మంచినీళ్లు తాగొచ్చా? ఒక వేళ పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగితే ఏమైనా అవుతుందా? అనారోగ్య సమస్యలు ఎదురవుతాయా? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతుంటాయి. అయితే, దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. అరటి పండ్లను తిన్న తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయనడంలో అర్థం లేదని పేర్కొంటున్నారు. పండ్లను తిన్న తర్వాత నీళ్లను నిరభ్యంతరంగా తాగొచ్చని, తిన్న తర్వాత నీళ్లను తాగితేనే మంచిదంటున్నారు.
అరటి పండ్లలో నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. తిన్న తర్వాత నీటిని తాగితే ఫైబర్ నీళ్లకు విస్తరించినట్లవుతుంది. దీంతో పేగుల్లో ఆహారం చురుగ్గా కదలడంతో సులభంగా జీర్ణమవుతుంది. దీంతో మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీర మెటబాలిజం సైతం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవడంతో కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గతారని నిపుణులు చెబుతున్నారు. అరటి పండ్లను తిన్న తర్వాత నిరభ్యంతరంగా నీటిని తాగొచ్చని, అపోహలను నమ్మొద్దని సూచిస్తున్నారు. అరటి పండ్లను తీసుకోవడం ద్వారా మనకు మంచి పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, పాస్ఫరస్, ఐరన్ అందుతాయి. ఇవి మనకు పోషణను, శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా మనల్ని అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతాయి.
రోజుకు ఒకటి, రెండు అరటి పండ్లను తినొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అరటి పండ్లు సులువుగా జీర్ణమవుతాయి. తిన్న కేవలం గంటలోపే వీటిలో ఉండే పోషకాలన్నింటిని శరీరం శోషించుకుంటుంది. తక్కువ సమయంలో పోషకాలు, శక్తి లభించాలంటే అరటి పండ్లను తప్పకుండా తీసుకోవాలి. అరటి పండ్లను పొటాషియం అధికంగా ఉంటుంది. మీడియం సైజ్ పండును తీసుకుంటే 420 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. రోజుకు రెండు పండ్లను తీసుకుంటే హైబీపీ అదుపులోకి వస్తుంది. బీపీ తగ్గించడంలో పొటాషియం ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలు సైతం ఆరోగ్యంగా ఉండి, గుండె పనితీరు మెరుగుపడుతుంది.