విధాత: ఇరవై ఎనిమిదేండ్లుగా తప్పించుకు తిరుగుతున్నగ్యాంగ్స్టర్ చోటా రాజన్ ముఠా సభ్యుడిని శనివారం ముంబై పోలీసులు అరెస్టుచేశారు. 1994 నాటి దోపిడీ కేసులో నిందితుడైన అతడు, నాటి నుంచి పోలీసులకు దొరక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ముంబై నగరంలోని ఆంటోప్ హిల్ ప్రాంతానికి చెందిన 59 ఏండ్ల సబీర్ బర్కతాలి లఖానీ చోటా రాజన్ గ్యాంగ్లో సభ్యుడు.
1994లో తన నలుగురు సహచరులతో కలిసి ముంబై చెంబూరులోని సింధీ క్యాంప్లోని ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కార్యాలయంలో దోపిడీ చేయాలనే ఉద్దేశంతో ఆయుధాలతో చొరబడ్డారు. విధి నిర్వహణలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ అధికారిపై కూడా దాడి చేశాడు. ఈ కేసులో నాటి నుంచి తప్పించుకు తిరుగుతున్న బర్కతాలి లఖానీ గుజరాత్లోని సూరత్లో పట్టుకున్నట్టు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం వెల్లడించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు.