Maharashtra | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
లోయలో పడిన ప్రైవేట్ బస్సు విధాత: మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని రాయగఢ్లో ప్రైవేట్ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, మరో 27 మందికి గాయాలయ్యాయి. వివరాళ్లోకి వెళితే.. పూణె నుంచి ముంబయి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఓ సంగీత బృందం ప్రయాణిస్తున్నది. వారంతా ముంబయిలోని గొరెగావ్ చెందిన వారు. పూణెకు దగ్గరిలోని పంప్రి చింఛ్వాడ్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి వస్తున్న క్రమంలో తెల్లవారుజామున […]

- లోయలో పడిన ప్రైవేట్ బస్సు
విధాత: మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని రాయగఢ్లో ప్రైవేట్ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, మరో 27 మందికి గాయాలయ్యాయి. వివరాళ్లోకి వెళితే.. పూణె నుంచి ముంబయి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఓ సంగీత బృందం ప్రయాణిస్తున్నది. వారంతా ముంబయిలోని గొరెగావ్ చెందిన వారు. పూణెకు దగ్గరిలోని పంప్రి చింఛ్వాడ్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరిగి వస్తున్న క్రమంలో తెల్లవారుజామున 4.50 గంటల సమయంలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఖపోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 27 మంది గాయపడినట్టు రాయ్గఢ్ ఎస్పీ వెల్లడించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చారు. మృతులంతా 25 ఏళ్లలోపు వారే.
Maharashtra CM Eknath Shinde expressed deep grief over the bus accident on the old Mumbai-Pune highway, he also spoke to Raigad Collector and SP & also the team engaged in rescue operation. A compensation of Rs 5 lakh will be given to the family members of the deceased and free…
— ANI (@ANI) April 15, 2023
ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలిలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి.
#WATCH | Maharashtra: Rescue operation underway in Raigad’s Khopoli area where 12 people died and over 25 others were injured after a bus fell into a ditch. pic.twitter.com/VHYGDBjyNp
— ANI (@ANI) April 15, 2023