Odisha సగం కాలిన నరమాంసం తిన్న ఇద్దరి అరెస్టు మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల దుశ్చర్య ఒడిశాలోని ఓ శ్మశాన వాటికలో దారుణం విధాత: మనుషులు రానురాను మరీ దారుణంగా తయారవుతున్నారు. మద్యం మత్తులో ఏమి చేస్తున్నామో, ఏమి తింటున్నామో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. చివరికి రాక్షసుల తరహాలో నరమాంస భక్షణ కూడా దిగారు. ఈ అమానవీయ ఘటన ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఒక శ్మశానవాటికలో చోటుచేసుకున్నది. నరమాంసం తిన్న ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. […]
Odisha
విధాత: మనుషులు రానురాను మరీ దారుణంగా తయారవుతున్నారు. మద్యం మత్తులో ఏమి చేస్తున్నామో, ఏమి తింటున్నామో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. చివరికి రాక్షసుల తరహాలో నరమాంస భక్షణ కూడా దిగారు. ఈ అమానవీయ ఘటన ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఒక శ్మశానవాటికలో చోటుచేసుకున్నది. నరమాంసం తిన్న ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దంతుని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా, అతడి భౌతిక కాయాన్ని గ్రామస్థులు అంత్యక్రియల నిమిత్తం శ్మశాన వాటికకు తరలించారు. చితికి నిప్పుపెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు. బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అదే గ్రామానికి చెందిన సుందర్ మోహన్ సింగ్ (58), నరేంద్ర సింగ్ (25) దహన సంస్కార స్థలంలో సగం కాలిన మానవ శరీరంలో కొంత భాగాన్ని తీసుకొని తినడం ప్రారంభించారు. దానిని స్థానికులు గమనించి అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మద్యం మత్తులో వారు ఈ చర్యకు పాల్పడ్డారని బాదాసాహి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ సబ్జయ్ పరిదా చెప్పారు. తమ దుశ్చర్యను వారు అంగీకరించారని తెలిపారు. ఐపీసీ 297 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితులు ఇద్దరిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు.