పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్లో 99.86 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1439 మంది ఓటర్లకు గాను 1437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నారాయణపేట, నాగర్ కర్నూల్ పోలింగ్ కేంద్రాలలో ఇద్దరు ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. మహబూబ్ నగర్ లో 245, వనపర్తి లో 218, గద్వాలలో 225 , కొల్లాపూర్ లో 67, అచ్చంపేటలో 79, కల్వకుర్తిలో 72 మంది, షాద్ నగర్ లో 171 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.నాగర్ కర్నూల్ లో 101 మందికి వంద మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఒక్కరు ఓటు వేయలేదు. నారాయణపేటలో 205 మందికి 204 మంది ఓటు హక్కును వినియోగించుకోగా ఒక్క ఓటరు మాత్రం ఓటు వేయలేదు. కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.