కడప ఎంపీ YS అవినాష్‌రెడ్డికి రెండోసారి CBI నోటీసులు

విధాత: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్నది. విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మూడు రోజుల కిందటే సీబీఐ మొదటిసారి అవినాష్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన ఐదు రోజులు గడువు కావాలని కోరారు. దీంతో సీబీఐ అధికారులు నేడు మరోసారి నోటీసులు అందజేశారు.

  • Publish Date - January 25, 2023 / 08:01 AM IST

విధాత: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్నది. విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ రెండోసారి నోటీసులు ఇచ్చింది.

ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మూడు రోజుల కిందటే సీబీఐ మొదటిసారి అవినాష్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ ఆయన ఐదు రోజులు గడువు కావాలని కోరారు. దీంతో సీబీఐ అధికారులు నేడు మరోసారి నోటీసులు అందజేశారు.