మెట్రో ఫేస్ 2 కారిడార్ DPRను ఆమోదించండి: మంత్రి కేటీఆర్
2023-24 బడ్జెట్లో పెట్టండి.. కేంద్రమంత్రి హారదీప్ సింగ్ పూరికి మంత్రి కేటీఆర్ లేఖ 31 కిలో మీటర్ల విస్తరణకు రూ.8,453 కోట్లతో డీపీఆర్ బి.హెచ్.ఈ. ఎల్. నుంచి లక్డికాపూల్ వరకు 26 కిలో మీటర్లు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు 5 కిలోమీటర్లు విధాత: మెట్రో రైల్ ఫేస్-2 కారిడార్కు రూ. 8453 కోట్లతో డీపీఆర్ రూపొందించామని, దీనికి ఆమోదం తెలుపుతూ బడ్జెట్లో ప్రతిపాదనలు పొందుపరచాలని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. […]

- 2023-24 బడ్జెట్లో పెట్టండి..
- కేంద్రమంత్రి హారదీప్ సింగ్ పూరికి మంత్రి కేటీఆర్ లేఖ
- 31 కిలో మీటర్ల విస్తరణకు రూ.8,453 కోట్లతో డీపీఆర్
- బి.హెచ్.ఈ. ఎల్. నుంచి లక్డికాపూల్ వరకు 26 కిలో మీటర్లు
- నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు 5 కిలోమీటర్లు
విధాత: మెట్రో రైల్ ఫేస్-2 కారిడార్కు రూ. 8453 కోట్లతో డీపీఆర్ రూపొందించామని, దీనికి ఆమోదం తెలుపుతూ బడ్జెట్లో ప్రతిపాదనలు పొందుపరచాలని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటైన హైద్రాబాద్ నగరంలోని మెట్రో రైల్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ కారిడార్ పనులను చేపట్టేందుకు ఆమోదంతో పాటు బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని కోరుతూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు.
లేఖలో మెట్రోరైల్ కారిడార్ -2 ఆవశ్యకత గురించి వివరించారు.. చాలా వేగంగా పెరుగుతున్న నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా కారిడార్ -2 కింద మెట్రో రైల్ విస్తరణ జరగాలని తెలిపారు. ఇప్పటికే మొదటి దశ కింద నడుస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టు నగరానికే కలికితురాయిగా నిలిచిందని మంత్రి కేటీఆర్ లేఖలో వివరించారు.
మెట్రో రైల్ ఫస్ట్ ఫేస్లో 69 కిలోమీటర్ల నిడివిలో అందుబాటులోకి వచ్చి నగర రవాణా వ్యవస్థకు అండగా నిలుస్తున్నదని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. వీజీఎఫ్ స్కీమ్ (వయబుల్ గ్యాప్ ఫండింగ్ ) పీపీపీ మోడ్ లో అమలు చేసిన హైదరాబాద్ రైల్ లైన్ ఫేస్-1 ప్రాజెక్ట్ ప్రపంచంలో పెద్ద మెట్రో ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందింధని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండవ విడత 31 కిలోమీటర్ల నిడివిలో మెట్రోరైల్ ప్రాజెక్టు – 2 కారిడార్ పనులకై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
1) బీ హెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కిలో మీటర్ల నిడివిలో 23 స్టేషన్లతో కనెక్ట్ చేసే ప్రతిపాదన.
2) నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల నిడివిలో 4 స్టేషన్లను కనెక్ట్ చేసే ప్రతిపాదన తో కూడిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ను తయారు చేసినట్లు మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టుటకు గాను రూ.8453 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు లేఖలో వివరించారు. ఈ డీపీఆర్తో పాటు అందుకు సంబంధిచిన అన్ని డాక్యుమెంట్స్ ను రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా అక్టోబర్ 22న కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
సెకండ్ ఫేస్ కు సంబంధించిన ప్రతిపాదనల వివరాలు చర్చించడానికి కేంద్రమంత్రి అపాయింట్ మెంట్ కావాలని మంత్రి కేటీఆర్ కోరారు. ముందస్తు సమాచారం కొరకు లేఖ ద్వారా వివరాలు తెలియ జేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎక్స్ టర్నల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు పాలనాపరమైన సూత్రప్రాయ అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు – 2 కారిడార్ ప్రతిపాదనలను 2022-23 బడ్జెట్లో పేర్కొనాలని మంత్రి వేడుకున్నారు.