Madhya Pradesh | ఇటు ఇంట్లో వివాదాలు.. అటు అప్పులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆందోళన.. ఈ రెండు సమస్యల మధ్య కూతురి పెళ్లి ఎలా చేయాలనే ఆవేదన.. ఇవన్నీ ఓ తండ్రి ఆత్మహత్యకు కారణమయ్యాయి. మొదట భార్యను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని పన్నాలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సంజయ్ సేథు అనే వ్యక్తి టెక్స్టైల్ వ్యాపారిగా కొనసాగుతున్నాడు. ఆయనకు భార్య, ఒక కూతురు […]
Madhya Pradesh | ఇటు ఇంట్లో వివాదాలు.. అటు అప్పులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆందోళన.. ఈ రెండు సమస్యల మధ్య కూతురి పెళ్లి ఎలా చేయాలనే ఆవేదన.. ఇవన్నీ ఓ తండ్రి ఆత్మహత్యకు కారణమయ్యాయి. మొదట భార్యను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని పన్నాలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సంజయ్ సేథు అనే వ్యక్తి టెక్స్టైల్ వ్యాపారిగా కొనసాగుతున్నాడు. ఆయనకు భార్య, ఒక కూతురు ఉంది. అయితే శనివారం తన ఇంట్లోని రెండో అంతస్తులో కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా, సేథు భార్య రక్తపు మడుగులో కనిపించింది. సంజయ్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాల పక్కనే ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. గురూజీ నన్ను క్షమించండి.. ఒక వేళ మరో జన్మంటూ ఉంటే.. మీ భక్తుడిగానే జన్మిస్తాను అని రాసి ఉంది. ఓ వీడియో కూడా లభ్యమైంది. అందులో సంజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తీసుకున్న అప్పులు చెల్లించండి అంటూ కొందరి పేర్లను ప్రస్తావించాడు. నా కూతురి పెళ్లికి రూ. 50 లక్షల నుంచి రూ. కోటి సిద్ధం చేయండి. ఇప్పటికే ఆమె ఖాతాలో రూ. 29 లక్షలు ఉన్నాయి. బంగారం ఆభరణాలు కూడా చాలా ఉన్నాయి. నేను, నా భార్య బతలేకపోతున్నాం.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నాం.. మమ్మల్ని క్షమించండి.. అంటూ సంజయ్ పేర్కొన్నాడు.
ఈ ఘటనపై పన్నా ఎస్పీ ధర్మరాజ్ మీనా స్పందించారు. కుటుంబ వివాదాల వల్లే సంజయ్ ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు మీనా పేర్కొన్నారు. ఈ ఘటన బాధాకరం.. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. బయటి వ్యక్తుల ప్రమేయం ఉండకపోవచ్చని ఎస్పీ తెలిపారు.