బీజేజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారిని దర్శించుకున్నారు.
ధర్మ రక్షణ పోరాటాన్ని కొనసాగించండి
ఆశీర్వదించిన శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి
విధాత బ్యూరో, కరీంనగర్: బీజేజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారిని దర్శించుకున్నారు. శృంగేరి పూర్వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వామిజీ 74వ వర్ధంతి సందర్భంగా శృంగేరి విచ్చేసిన బండి సంజయ్ ప్రస్తుత పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామిని కలుసుకున్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ను ఆశీర్వదించిన శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి ధర్మ రక్షణ కోసం చేస్తున్న పోరాటాలను అభినందించారు. ‘‘ధర్మాన్ని వీడొద్దు.. ధర్మరక్షణను కొనసాగించండి. ధర్మ పరిరక్షణ, గోసంరక్షణ కోసం సమాజాన్ని సంఘటితం చేయడంలో ముందుండి పోరాడండి’’ అంటూ ఆశ్వీర్వదించారు. బండి సంజయ్తోపాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.