విధాత: పాలన చేతగాకనే సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు..లీక్లతో దుష్ప్రచారం సాగిస్తూ టైమ్ పాస్ చేస్తు ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని బీఆరెస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి విమర్శించారు. బుధవారం సూర్యాపేటలో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ డెడ్ స్టోరేజీలో కూడా ఆయకట్టు కింద నీళ్లు ఇచ్చి కాపాడిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో మూడు పిల్లర్లు కుంగితే కేసీఆర్ తప్పు ఎలా అవుతుందో కాంగ్రెస్ సన్నాసులు చెప్పాలన్నారు.
ఇప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లిఫ్ట్ చేసి నీళ్లు అందించవచ్చని, కేసీఆర్కు ఎక్కడ ఆదరణ వస్తుందో అని భయంతో కాళేశ్వరం పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ సూర్యాపేటకు వచ్చి, రైతులకు భరోసానివ్వగానే కాంగ్రెసోళ్ల లాగులు తడిసిపోయి వెంటనే కాళేశ్వరం బాహుబలి మోటార్లు అన్ చేసి నీళ్లు ఇచ్చారని, అంతకుముందే ఆ సోయి ఎక్కడికి పోయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిగ్గు లేని దద్దమ్మలు కాంగ్రెస్ పాలకులు కనీస అవగాహన, బాధ్యత లేని మూర్ఖులుగా పాలన సాగిస్తుిండటంతో ప్రజలకు సాగుతాగునీటి కష్టాలు ఎదురయ్యాయన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా అన్నదాతలను నాశనం చేశారని, రుణాలు ఇవ్వమని బ్యాంక్ లకు ఆదేశాలు ఇవ్వమంటే కూడా కాంగ్రెస్ వాళ్లకు చేతకాలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ఒక్కరోజు బయటికి వస్తేనే కాంగ్రెసోళ్లకు లాగులు తడిసినాయని, ఒకరు మించి ఒకరు కేసీఆర్ను దుర్భాషలాడుతు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జోలికి వస్తే ఖబడ్దార్ కొడకల్లారా మిమ్మల్ని రాజకీయంగా బొంద పెడతామని హెచ్చరించారు. తెలంగాణ తెచ్చి, పదేళ్ల పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ను తిట్టేందుకేనా ప్రజలు మీకు ఓటు వేసిందంటూ ప్రశ్నించారు.
గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామరక్ష
పార్లమెంట్ ఎన్నికల్లో అసమర్ధత కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లకు అహంకారం, అధికార మదం ఎక్కువ అయిందని, కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని, కేససీఆర్ వల్లనే కాంగ్రెస్ వాళ్లకు పదవులు వచ్చాయన్నారు. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామా రక్ష అని, కాంగ్రెస్ చేతకాని తనం వల్లనే నాగార్జున సాగర్ డ్యామ్ కేంద్రం పరిధిలోకి వెళ్ళిందని, కేసీఆర్ కన్నెర్ర జేస్తే అప్పటికప్పుడు కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు ఇవ్వబోమంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టి తుతూ మంత్రంలా మామా అనిపించారన్నారు.
కాంగ్రెస్ పాలకులు చెబుతున్న గుజరాత్ మోడల్ అంటేనే వినాశనం… విధ్వంసమే బీజేపీ పాలసీ అని, బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలకు ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదని, అందుకే కేసీఆర్ తయారు చేసిన నాయకులను పార్టీ లోకి గుంజుకొని టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి వాళ్ళను తన్ని తరిమేసినం..మీరెంత అని, కాంగ్రెస్ వాళ్లు దారి దోపిడీ దొంగల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా మంత్రులు రైస్ మిల్లర్లను పీడించి, అక్రమ వసూళ్లు చేశారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ గెలిస్తేనే ఈ ప్రభుత్వం అహంకారం తగ్గుతుందని, కాంగ్రెస్ వాళ్ళ అధికార మదం అణిచివేయాలంటే బీఆరెస్ను ఎంపీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.