కామారెడ్డిలో బీఆరెస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన జడ్పీటీసీ

సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో బీఆరెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. బీఆరెస్‌ పార్టీ దోమకొండ మండలం జడ్పీటీసీ తీగల తిరుమల్ గౌడ్, గ్రామ రైతు బంధు కన్వీనర్‌ మధుసూదన్ రెడ్డిలు బీఆరెస్‌కు రాజీనామా చేశారు.

కామారెడ్డిలో బీఆరెస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన జడ్పీటీసీ

విధాత : సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో బీఆరెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. బీఆరెస్‌ పార్టీ దోమకొండ మండలం జడ్పీటీసీ తీగల తిరుమల్ గౌడ్, గ్రామ రైతు బంధు కన్వీనర్‌ మధుసూదన్ రెడ్డిలు బీఆరెస్‌కు రాజీనామా చేశారు.


గురువారం వారు పీసీసీ చీఫ్‌ కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు.