Cyber Crime మాజీ హోంమంత్రి, విశ్రాంత ఐఎఫ్ ఎస్లను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు విధాత: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు, ప్రజలకు తెలియకుండానే వారి డబ్బులను దోచుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈ-మెయిల్స్తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఈ బాధితుల్లో ప్రముఖులు కూడా చేరిపోయారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఎంపీ పేరుతో కేటుగాళ్లు ఏకంగా మాజీ హోంమంత్రి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారులకే డబ్బులు అడిగి సక్సెస్ అయ్యారు. పశ్చిమగోదావరి […]
Cyber Crime
విధాత: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు, ప్రజలకు తెలియకుండానే వారి డబ్బులను దోచుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈ-మెయిల్స్తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఈ బాధితుల్లో ప్రముఖులు కూడా చేరిపోయారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఎంపీ పేరుతో కేటుగాళ్లు ఏకంగా మాజీ హోంమంత్రి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారులకే డబ్బులు అడిగి సక్సెస్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ హరిరామజోగయ్య పేరుతో సైబర్ నేరగాళ్లు ఆయన పేరిట పలువురికి ఫోన్ కాల్స్ చేశారు.
తనకు కొంత డబ్బు పంపాలంటూ ఫోన్లో రిక్వెస్ట్ చేశారు. దీంతో సాక్షాత్తూ మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి రూ.9 వేలు ట్రాన్స్ ఫర్ చేశారు. మరో విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి రావు కూడా ఇలాగే డబ్బులు పంపి మోసపోయారు.
విషయం తెలుసుకున్న హరిరామ జోగయ్య తన పేరుతో వచ్చే ఫోన్లకు ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని బహిరంగ లేఖ రాశారు. ఫోన్ ద్వారా పాలకొల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి వివరాలు తెలియజేస్తే 24 గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.