హామీలన్ని అమలు చేస్తాం..మోసం చేస్తే ఇంటికి పంపిస్తారని తెలుసు: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని, ఎవరిని మోసం చేయాలని ఆలోచన తమకు లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు

హామీలన్ని అమలు చేస్తాం..మోసం చేస్తే ఇంటికి పంపిస్తారని తెలుసు: డిప్యూటీ సీఎం భట్టి

విధాత, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని, ఎవరిని మోసం చేయాలని ఆలోచన తమకు లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండల సీతారాంపురం సభలో భట్టి మాట్లాడుతూ పదేళ్లు ప్రజలకు భ్రమలు కల్పించి పబ్బం కడుపుకోవాలనే ఆలోచన అంతకన్నా లేదన్నారు. వందేళ్ళ చరిత్ర కలిగిన ఈ పార్టీ మరో వందేళ్లు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలన సాగించి ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలను మోసం చేసి పాలన సాగిస్తే రానున్న రోజులు ఇంటికి పంపిస్తారని తెలుసన్నారు. ప్రజలకు అంకితమై పని చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యాంలో ఆరు గ్యారెంటీలు తప్పక అమలు చేసి తీరుతామని చెప్పారు. రాష్ట్రంలో పేదలకు 2 వందల యూనిట్లు విద్యుత్, 5 వందలకే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిపిస్తున్నామన్నారు. పేదల కోసం రూ.10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.


తనను ఈ స్థాయిలో నిలిపింది మధిర నియోజకవర్గ ప్రజలేనని, వారి ఓటుకు గౌరం తెచ్చే విధంగా పనిచేస్తానన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తిరిగి ఆదుకుంటుందని తెలిపారు. నిరుద్యోగులు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడ్డారన్నారు. రూ.2.75 కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఉదేశ్యంతో ప్రవేశపెట్టమన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అతికొద్ది రోజుల్లోనే గ్రూప్ 1నోటిఫికేషన్ కూడా విడుదల చేశామని, ఇప్పటికే 25వేల ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు. రాష్టంలో ప్రతి బిడ్డ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలనేదే తమ ప్రభుత్వా లక్ష్యమన్నారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను అందజేస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, పనుల విషయంలో అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా సక్రమంగా ఉండాలని ఆదేశించారు.