విధాత, మెదక్ బ్యూరో: ఉన్న ఊరు.. కన్నతల్లిని మరవని వారు అభివృద్ధి కాముకులని, సీఎం కేసీఆర్ కార్యాలయ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో కన్వెన్షన్ సెంటర్తో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీశ్రావు ఆదివారం ప్రారంభించి రాజశేఖర్ రెడ్డిని అభినందించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలసి ఆదివారం చేగుంట మండలం బోనాల ఇబ్రహీంపూర్ వద్ద రామంపేట కెనాల్లో కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చిన […]
విధాత, మెదక్ బ్యూరో: ఉన్న ఊరు.. కన్నతల్లిని మరవని వారు అభివృద్ధి కాముకులని, సీఎం కేసీఆర్ కార్యాలయ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో కన్వెన్షన్ సెంటర్తో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీశ్రావు ఆదివారం ప్రారంభించి రాజశేఖర్ రెడ్డిని అభినందించారు.
ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలసి ఆదివారం చేగుంట మండలం బోనాల ఇబ్రహీంపూర్ వద్ద రామంపేట కెనాల్లో కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చిన గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. అదేవిధంగా నిజాంపేట మండలం నార్లాపూర్ వద్ద బొల్లికుంట చెరువులోకి గోదావరి జలాలను వదిలారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఎండాకాలంలో నీళ్ళు మడులు దుంకుతున్నాయి. రైతులు ముఖాన్ని మొగులికి చూసే అవసరం లేకుండా ముఖ్యమంత్రి కాలేశ్వరం జలాలను తాగునీటికి , సాగునీటికి అందిస్తున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని మేడిగడ్డ నుంచి 530 మీటర్ల ఎత్తున గోదావరి జలాలను ఎత్తిపోస్తూ 310 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్కు నీటిని తీసుకువచ్చామని అన్నారు.
ఇక బోర్లు, బావులలో ఊట పెరుగుతుందని, ఎప్పుడు కాల్వలో నీటి ప్రవాహం ఉంటుందని, చెరువులు, కుంటలు నింపుకోవడం ద్వారా రెండు పంటలు పండించు కోవచ్చని అన్నారు రైతులు 365 రోజులు కడుపు నిండా తినవచ్చన్నారు.
బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం ఆసరా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అందిస్తున్నదని, వచ్చే ఉగాది అనంతరం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేయనున్నామని ఆయన తెలిపారు. పుట్టబోయే బిడ్డ బలంగా, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో బిడ్డ కడుపులో ఉన్న మూడో మాసంలో తిరిగి ఏడవ మాసంలో న్యూట్రిషన్ కిట్ అందించనున్నామన్నారు.
అదేవిధంగా సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డి ధర్మారంలో నిజాంపేటలో మహిళా భవనం నిర్మాణానికి మంజూరు చేశారు.
అంతకుముందు మంత్రి రామాయంపేట మండలం ధర్మారంలో మూడు కోట్ల 70 లక్షలతో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ను, మన ఊరి మనబడి కింద 80 లక్షలతో జిల్లా పరిషత్ హైస్కూల్ రెనోవేషన్, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. కోటి 50 లక్షలు వ్యయంతో ఊర చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, రాజశేఖర్ జడ్పీటీసీలు, ఎంపీపీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.