Gold Rate | మగువలకు షాక్ పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rate | బంగారం ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగాయి. నిన్న రూ.20 వరకు పెరిగిన ధర బుధవారం మరోసారి పైకి కదిలింది. 22 క్యారెట్ల తులం గోల్డ్పై రూ.120 పెరిగి రూ.55,100 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.120 పెరిగి.. రూ.60,100కి చేరింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,130 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,130కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల […]

Gold Rate | బంగారం ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగాయి. నిన్న రూ.20 వరకు పెరిగిన ధర బుధవారం మరోసారి పైకి కదిలింది. 22 క్యారెట్ల తులం గోల్డ్పై రూ.120 పెరిగి రూ.55,100 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.120 పెరిగి.. రూ.60,100కి చేరింది.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,130 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,130కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,100కి చేరింది.
చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,550 వద్ద కొనసాగుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,100కి పెరిగింది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.60,100 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు సైతం పెరిగాయి. ఇటీవల భారీగా పెరుగుతూ వస్తున్న వెండి మరోసారి కిలోకు రూ.300 వరకు పెరిగి కిలోకు రూ.78వేలు పలుకుతున్నది. హైదరాబాద్లో కిలో రూ.81,400 ఎగిసింది.