బంగారం ధరలు ఇటీవల భారీగా పెరుతూ వస్తున్నాయి. పలుమార్లు దిగివచ్చినా అది స్వల్పంగానే ఉంటున్నది
విధాత: బంగారం ధరలు ఇటీవల భారీగా పెరుతూ వస్తున్నాయి. పలుమార్లు దిగివచ్చినా అది స్వల్పంగానే ఉంటున్నది. నిన్న బలియన్ మార్కెట్లో ఒకే రోజు బంగారం రూ.800 వరకు పెరిగింది. సోమవారం తాజాగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు స్వల్ప ఊరట దక్కినట్లయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీగా పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో బంగారాన్ని భారీగా డిమాండ్ ఉన్నది. ఈ క్రమంలో పుత్తడి ధర పెరగడంతో అందరూ బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.58,450 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.63,750 వద్ద నిలకడగా ఉన్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.59,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.65,530 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.58,450 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,760 వద్ద కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.58,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,910 వద్ద నిలకడగా ఉన్నది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.58,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,760 పలుకుతున్నది. మరో వైపు నిన్న భారీగానే పెరిగిన వెండి ధర ఇవాళ నిలకడగానే కొనసాగుతున్నది. హైదరాబాద్లో కిలో రూ.80,500 వద్ద ట్రేడవుతున్నది.