Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం ధర..! హైదరాబాద్లో నేటి ధరలు ఇవే..!
బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. ఇటీవల పసడి ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి.

\Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. ఇటీవల పసడి ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. యూఎస్ ఫెడ్ సమావేశం ప్రారంభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్ల సైతం పడుతున్నది. ఈ క్రమంలో బుధవారం బులియన్ మార్కెట్లో ధరలు పెరిగినట్లుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 22 క్యారెట్ల పసిడిపై రూ.200 పెరగ్గా తులం రూ.58వేలు పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.220 పెరిగి రూ.63,270కి ఎగిసింది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,930కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58వేలు ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.63,270కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,420కి ఎగిసింది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.58వేలు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,270 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి. రూ.300 పెరిగి కిలో ధర రూ.76,500 పలుకుతున్నది. హైదరాబాద్లో బంగారం ధర కిలోకు రూ.78వేలకు ఎగిసింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.