Gold Rates | స్వల్పంగా పెరిగిన పసిడి.. నేడు హైదరాబాద్లు ధర ఎలా ఉందంటే..?
బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో వెండి ధర సైతం దిగివచ్చింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగి తులానికి రూ.57,460కి పెరిగింది

Gold Rates | బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో వెండి ధర సైతం దిగివచ్చింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగి తులానికి రూ.57,460కి పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.62,680 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,110 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,280 పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,460 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,680కి చేరింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,610 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,830కి ఎగిసింది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.57,460 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,680 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం తగ్గింది. కిలోకు రూ.100 వరకు దిగివచ్చింది.
ప్రస్తుతం హైదరాబాద్లో కిలోకు రూ.77,400 వద్ద ట్రేడవుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.