Gold Rates | ఇటీవల కాలంలో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులుపడుతున్నారు. సోమవారం పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.10 తగ్గి తులం రూ.60,580కి చేరింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.10 తగ్గి తులం రూ.66,090కి దిగివచ్చింది. మరో వైపు వెండి ధర సైతం స్వల్పంగా పతనమైంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.61,140 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,700కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.60,590 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.66,100 వద్ద స్థిరంగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.60,730 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,240కి చేరింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.60,580 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.66,580 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర సైతం స్వల్పంగా పతనమైంది. రూ.100 తగ్గి కిలో బంగారం ధర రూ.77,200కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో బంగారం ధర రూ.80,200కు తగ్గింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.