కామెర్ల వ్యాధికి చికిత్స పొందుతూ తుదిశ్వాస ఇటీవలే చివరి పాటను విడుదల చేసిన రాజు Raju Punjabi | విధాత: హర్యానావి గాయకుడు రాజు పంజాబీ ఇకలేరు. హర్యానాలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నరాజు (40) హర్యానా హిసార్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడటంతో దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాజు ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో తిరిగి దవాఖానలో చేరారు. […]
Raju Punjabi | విధాత: హర్యానావి గాయకుడు రాజు పంజాబీ ఇకలేరు. హర్యానాలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నరాజు (40) హర్యానా హిసార్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడటంతో దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాజు ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో తిరిగి దవాఖానలో చేరారు. ఆరోగ్య ఒక్కసారిగా క్షీణించడంతో మంగళవారం రాజు తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ప్రఖ్యాత గాయకుడు రాజు పంజాబీ మృతి వార్త బయటకు తెలియడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫొటోను సోషల్మీడియాలో షేర్ చేసి సంతాపం ప్రకటించారు. లెజెండరీ గాయకుడిని కోల్పోయామని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం రాజు తన చివరి పాట “ఆప్సే మిల్కే యారా హమ్కో అచ్చా లగా థా”ను విడుదల చేశారు.