కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..!

Kamareddy Master Plan | కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ వివాదంపై రాష్ట్ర హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రజాశాంతి పార్టీలో అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసం విచారించింది. అయితే, విచారణ సందర్భంగా కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని నిలిపివేసినట్లు ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే, దీనిపై స్పందించిన ప్రజల […]

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..!

Kamareddy Master Plan | కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ వివాదంపై రాష్ట్ర హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రజాశాంతి పార్టీలో అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసం విచారించింది. అయితే, విచారణ సందర్భంగా కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని నిలిపివేసినట్లు ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే, దీనిపై స్పందించిన ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటే పూర్తిగా మాస్టర్‌ ప్లాన్‌ను ఎందుకు రద్దు చేయాలని ప్రశ్నించింది. హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్‌ ప్లాన్‌పై ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

మాస్టర్‌ ప్లాన్‌ అంశానికి సంబంధించి సింగిల్‌ బెంచ్‌లో ఉన్న మరో పిటిషన్‌ను డివిజన్‌ బెంచ్‌లో ఇంప్లీడ్‌ చేసింది. విచారణను ఏప్రిల్‌ 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశంపై ఇంతకు ముందు కేఏ పాల్‌ వాదనలు వినిపిస్తూ మాస్టర్ ప్లాన్ కారణంగా ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, ఒక ఎకరం లేదా అంతకంటే తక్కువ ఉన్న దాదాపు 2వేల మంది సన్నకారు రైతులు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతుండగా.. ప్రభుత్వం ఏక్షపక్షంగా వారి అభిప్రాయాలను తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్‌ జారీ చేసిందని ఆరోపించారు. మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారని, ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ నియంతలుగా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

మరో వైపు ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌ను ఉపసంహరించుకోవాలని పురపాలక సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం సమర్పించిందని కామారెడ్డి మున్సిపాలిటీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనలపై కేఏ పాల్ వాదిస్తూ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను ఉపసంహరించుకోవడానికి లేదా రద్దు చేయడానికి మున్సిపాలిటీకి ఎటువంటి అధికారాలు లేవన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, ఈ నేపథ్యంలోనే కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిపై వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు విచారణను సోమవారానికి (ఫిబ్రవరి 13) వాయిదా వేసింది. ఈ క్రమంలోనే హైకోర్టులో విచారణ జరిపింది. కామారెడ్డి ప్రాంతంలో సాగు భూములను ఇండస్ట్రియల్‌ జోన్‌ నుంచి తొలగించాలని రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.