సీఎం రేవంత్‌రెడ్డితో ఇస్రో చైర్మన్ సోమనాథ్ భేటీ

సీఎం రేవంత్‌రెడ్డితో బుధవారం సచివాలయంలో ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ భేటీ అయ్యారు.

సీఎం రేవంత్‌రెడ్డితో ఇస్రో చైర్మన్ సోమనాథ్ భేటీ

విధాత, హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌రెడ్డితో బుధవారం సచివాలయంలో ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సోమనాథ్ సమక్షంలో ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఆర్‌ఆండ్‌బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజుతో పాటు ఎన్ఆర్ఎస్సీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.