జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు
విధాత, హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఆయ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వాహణపై స్పష్టతనిచ్చారు. అక్కడ భద్రత దృష్ట్యా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులకు భద్రత కేటాయించాల్సి ఉంటుందని.. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కశ్మీర్లో ఎన్నికలు నిర్వాహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేమన్నారు. 2019లో జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించారని, డీలిమిటేషన్ ప్రక్రియ 2023లో ముగిసిందని తెలిపారు.
మొత్తం 107 సీట్లలో 27 పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయన్నారు. జమ్మూ కాశ్మీర్లోని అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని కోరాయన్నారు. కానీ అధికార యంత్రాంగం ఏకకాలంలో ఎన్నికలు సాధ్యం కావని చెప్పినట్లు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10-12 మంది అభ్యర్థులు ఉంటారని.. మొత్తంగా వెయ్యికంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థికి బలగాలను అందించాల్సి ఉంటుందని..పార్లమెంటు ఎన్నికల సమయంలో అది సాధ్యం కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. హింసాత్మక మణిపూర్లోని శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ శిబిరాల నుంచి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.