Karimnagar అంబేద్కర్ చౌరస్తా వద్ద మృతుని బంధువుల ఆందోళన అదుపులోకి తీసుకున్న పోలీసులు, అంబేద్కర్ చౌరస్తా వద్ద పరిస్థితి ఉద్రిక్తం విధాత బ్యూరో, కరీంనగర్: ఇసుక లారీలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. లారీల వేగం సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. తాజాగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనం యువ రైతు ప్రాణాలను బలిగొంది. ధాన్యం మిల్లు నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న రైతును తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న అశోక్ […]
Karimnagar
విధాత బ్యూరో, కరీంనగర్: ఇసుక లారీలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. లారీల వేగం
సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. తాజాగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనం యువ రైతు ప్రాణాలను బలిగొంది.
ధాన్యం మిల్లు నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న రైతును తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న అశోక్ లేలాండ్ వాహనం డీకొట్టడంతో రైతు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు.
స్థానికులు మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్ళపల్లి మండలం దేశాయ్ పల్లి గ్రామానికి చెందిన రైతు గట్టు బాల్ రెడ్డి (38) ధాన్యాన్ని రైస్ మిల్లుకు తరలించాడు. తేమశాతం ఎక్కువ వచ్చిందని చెప్పడంతో మిల్లు నుండి తిరిగి వస్తుండగా గురువారం రాత్రి సారంపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న అశోక్ లేలాండ్ వాహనం బాల్ రెడ్డిని ఢీ కొట్టి తలపై నుంచి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు రుత్విక, సాత్విక ఉన్నారు.
రైతు బాల్ రెడ్డిని అక్రమ ఇసుక రవాణా ప్రాణం తీసిందని ఆరోపిస్తూ గ్రామస్తులు మృతుని బంధువులు శుక్రవారం జిల్లా ఏరియా ఆసుపత్రి ముందు అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. ఇంకెంత మంది ప్రాణాలు తీస్తారంటూ రోదిస్తూ మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన విరవింపజేసే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వి వాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన యువరైతు కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.