మా బడిలో పురుగుల అన్నం పెడుతున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి!

విధాత‌: సారూ మా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులన్నం తినబుద్దైతలేదు. అయినా అదే తినాలని మా టీచర్లు చెబుతున్నారు. తినకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపుతరట. అందుకే ఇవాళ స్కూల్​కు పోలే. వాళ్ల మీద కేసు పెట్టడానికి మీ కాడికి వచ్చినస ఒక చిన్నారి పోలీసు స్టేష‌న్‌కి వ‌చ్చి వాపోయింది. పూర్తి వివ‌రాలు.. ప్రశాంతిహిల్స్‌లో నివాసం ఉంటున్న శ్రీను కుమార్తె పూజిత స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. రంగారెడ్డి జిల్లా […]

  • By: krs    latest    Dec 09, 2022 7:58 AM IST
మా బడిలో పురుగుల అన్నం పెడుతున్నారు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి!

విధాత‌: సారూ మా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులన్నం తినబుద్దైతలేదు. అయినా అదే తినాలని మా టీచర్లు చెబుతున్నారు. తినకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపుతరట. అందుకే ఇవాళ స్కూల్​కు పోలే. వాళ్ల మీద కేసు పెట్టడానికి మీ కాడికి వచ్చినస ఒక చిన్నారి పోలీసు స్టేష‌న్‌కి వ‌చ్చి వాపోయింది. పూర్తి వివ‌రాలు..

ప్రశాంతిహిల్స్‌లో నివాసం ఉంటున్న శ్రీను కుమార్తె పూజిత స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. రంగారెడ్డి జిల్లా మీర్​పేట పోలీస్​ స్టేషన్​లో పై విధంగా ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సీఐ మహేందర్ రెడ్డి వెంటనే తమ సిబ్బందిని పాఠశాలకు పంపించారు.

అక్కడికి వెళ్లి పరిశీలించగా నిజంగానే కూరగాయలు బాగోలేవని, బియ్యం కూడా మట్టి పట్టి ఉన్నట్లు గుర్తించారు. ఆ చిన్నారి చూపిన ధైర్యాన్ని పోలీసులు అభినందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టారు.