సూర్యాపేటకు తలమానికం..పెద్దగట్టు లింగమంతుల జాతర
బీఆర్ఎస్ హయాంలోనే గట్టు అభివృద్ది సబ్బండ వర్ణాల అభ్యున్నతే సీఎం కేసిర్ లక్ష్యం: మంత్రి జగదీష్రెడ్డి విధాత: రాష్ట్రంలోని సబ్బండ వర్ణాల అభ్యున్నతే సిఎం కేసీఆర్ లక్ష్యమని తెలంగాణలో ప్రతీ వర్గం, కులం బాగుపడాలనేదే కేసీఆర్ సంకల్పం అని అన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతర సందర్బంగా నియోజకవర్గానికి చెందిన యాదవ సొదరులకు సంప్రదాయ దుస్తులు, 150 భేరీలను […]

- బీఆర్ఎస్ హయాంలోనే గట్టు అభివృద్ది
- సబ్బండ వర్ణాల అభ్యున్నతే సీఎం కేసిర్ లక్ష్యం: మంత్రి జగదీష్రెడ్డి
విధాత: రాష్ట్రంలోని సబ్బండ వర్ణాల అభ్యున్నతే సిఎం కేసీఆర్ లక్ష్యమని తెలంగాణలో ప్రతీ వర్గం, కులం బాగుపడాలనేదే కేసీఆర్ సంకల్పం అని అన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతర సందర్బంగా నియోజకవర్గానికి చెందిన యాదవ సొదరులకు సంప్రదాయ దుస్తులు, 150 భేరీలను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అన్ని సంస్కృతులు, సంప్రదాయాలకు గౌరవం లభించేది దేశంలో ఒక్కతెలంగాణ రాష్ట్రంలోనే అని అన్నారు. 2014కు ముందు పెద్ద గట్టును ఏ పాలకులు పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే ఇప్పటి వరకూ 15 కోట్ల రూపాయలతో గట్టు పై శాశ్వత నిర్మాణాలు చేపట్టామన్నారు. సూర్యాపేటకు తలమానికం గా ఉన్న పెద్ద గట్టుకు జాతర సందర్బంలోనే కాకుండా, నిత్య భక్తుల తాకిడి ఎక్కువైందని వారి కోసమే శాశ్వత మంచి నీటి టాంక్, గెస్ట్ హౌజ్, పూజారి నివాసం, కోనేరు నిర్మాణం, మహిళ కోసం గదుల వంటి నిర్మాణాలను చేపట్టామన్నారు.
గత పాలకుల మాదిరిగానో, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానో మావి ఓట్ల రాజకీయాలు కాదు. ప్రజా సంక్షేమమే మా ధ్యేయమన్న మంత్రి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసే కేసీఆర్ పాలన కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. సందర్బం ఎప్పుడు వచ్చినా యాదవ సమాజం మొత్తం కేసీఆర్ కు, బీఆరెస్ కు అండగా నిలవాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా గట్టు అభివృద్ధికి ఆకర్షితుడై కాంగ్రెస్కు చెందిన మాజీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అభివృద్ది కి మద్దతుగా తాను కాంగ్రెస్ను వీడి బిఆర్ఎస్లో చేరానన్నారు.
కార్యక్రమంలో గట్టు కోడి సైదులు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గొపగాని వెంకట్ నారాయణ గౌడ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ ఎస్ రాష్ట కార్యదర్శి వై. వీ,పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మది భిక్షం, సూర్యాపేట ఎంపిపి రవీందర్రెడ్డి, జడ్పీటీసీలు జీడి భిక్షం, సంజీవ నాయక్, అనిత అంజయ్య, సింగిల్ విండో చైర్మన్లు, మండల అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.