క్రీడలతో కూడిన పరిపూర్ణ విద్య కు కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులలో ఒత్తిడి అధిగమించే నైపుణ్యాలు క్రీడలు నేర్పుతాయి జీవితాన్ని చదవడంలో క్రీడలదే ప్రముఖ పాత్ర 155 ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ Minister Jagadish Reddy | విధాత: ప్రస్తుత సమాజంలో చిన్నారులకు కావాల్సిన అసలైన విద్య క్రీడలతోనే లభిస్తుందని సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) పేర్కొన్నారు. చిన్నారులలో క్రీడా స్ఫూర్తిని […]
Minister Jagadish Reddy | విధాత: ప్రస్తుత సమాజంలో చిన్నారులకు కావాల్సిన అసలైన విద్య క్రీడలతోనే లభిస్తుందని సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) పేర్కొన్నారు. చిన్నారులలో క్రీడా స్ఫూర్తిని పెంచడమే లక్ష్యంగా సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జిల్లాలో ఉన్న 155 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్ లకు క్రీడ సామాగ్రితో కూడిన కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీవితాన్ని చదవడంలో క్రీడలదే ప్రముఖ పాత్ర అన్నారు. చిన్న చిన్న కారణాలకు పిల్లలు ఇటీవల కాలంలో అఘాయిత్యాలకు పాల్పడటానికి కారణం తరగతి గది, హాస్టల్ గదికి పరిమవుతూ క్రీడలకు దూరంగా ఉండటం, క్రీడా (Sports) స్ఫూర్తి కొరవడటమే పిల్లల అఘాయిత్యాలకు కారణం అన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో సెల్, టీవి లకే పరిమితమవుతుండటంతో చిన్న చిన్న కారణాలకు ఒత్తిడికి గురవుతున్న పిల్లలను బయట పడేయటంలో క్రీడలదే ప్రధాన పాత్ర అన్నారు.
క్రీడలలో గెలుపు, ఓటముల ద్వారా వచ్చే అనుభవాలు జీవితంలో వచ్చే ఆటు, పోటులను తట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇటీవల తాను సూర్యాపేట (Suryapet) నియోజక వర్గంలో నిర్వహించిన క్రీడలలో సైతం వేలాది గా ప్రజలు పాల్గొనడం, అందునా, మహిళలు 27 వేల మంది పాల్గొనడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
50 ఏళ్ళ వయసులో సైతం మహిళలు కబడ్డీ ఆడటం, ఆటలు నిర్వహించినందుకు తనకు ధన్యవాదాలు చెప్పడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు. పిల్లలకు ఉపయోగపడే ఏ కార్యక్రమంలో అయినా నా భాగస్వామ్యం ఉంటుందన్న మంత్రి, క్రీడలతో కూడిన పరిపూర్ణ విద్యకు కేరాఫ్ గా ను ప్రభుత్వ పాఠశాలలను తీర్చిద్ధిద్ది సూర్యాపేట జిల్లాను క్రీడా హబ్ గా తీర్చి దిద్దాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ (Collector Venkat Rao), డీఈవో తదితరులు పాల్గొన్నారు.