Warangal: స్నేహితుని కోసం.. గోడ దూకి ప్రశ్నా పత్రం కాపీ! మైనర్‌తో పాటు మరో ఇద్దరు అరెస్ట్

24 గంటల్లోపు చేధించిన వరంగల్ పోలీసులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదవ తరగతి వార్షిక హింది పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహరంలో వరంగల్ పోలీసులు వేగంగా ప్రతిస్పందించారు. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసును చేధించారు. ఈ కేసులో ఒక మైనర్ బాలుడితో పాటు మరో ఇద్దరు నిందితులను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలు.. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి మూడు సెల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం […]

Warangal: స్నేహితుని కోసం.. గోడ దూకి ప్రశ్నా పత్రం కాపీ! మైనర్‌తో పాటు మరో ఇద్దరు అరెస్ట్
  • 24 గంటల్లోపు చేధించిన వరంగల్ పోలీసులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదవ తరగతి వార్షిక హింది పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహరంలో వరంగల్ పోలీసులు వేగంగా ప్రతిస్పందించారు. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసును చేధించారు. ఈ కేసులో ఒక మైనర్ బాలుడితో పాటు మరో ఇద్దరు నిందితులను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల వివరాలు.. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి మూడు సెల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో హనుమకొండ జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలుడితో పాటు కమలాపూర్ గ్రామానికి చెందిన మౌటం శివ గణేష్(18) , హనుమకొండ మండలం, ఆరెపల్లికి చెందిన మాజీ విలేకరి బూరమ్ ప్రశాంత్‌గా గుర్తించారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వివరాలను వెల్లడిస్తూ నిందితుల్లో ఒకడైన మైనర్ నిందితుడు ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష రాస్తున్న తన మిత్రుడికి పరీక్షలో సహాయం అందించడం కోసం సిద్ధమయ్యాడు.

మైనర్ నిందితుడు ఈ రోజు పదవ తరగతి హిందీ పరీక్ష జరుగుతున్న సమయంలో కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ బాలుర పాఠశాల వెనుక భాగంలోని ప్రహరీ ప్రక్కనే వున్న చెట్టు సహాయంతో ప్రహరీ గోడ ఎక్కి దాని పాఠశాల మొదటి అంతస్తులోని మూడవ నంబ‌ర్ గదికి సంబంధించి ప్రహరీ గోడ ప్రక్కన ఉన్న‌ కిటికి ప్రక్కనే పరీక్ష వ్రాస్తున్న బాలుడి వద్దకు చేరుకున్నారు.

అతని నుండి మైనర్ నిందితుడు ఉదయం 9.45 నిమిషాలకు హిందీ పరీక్ష పత్రాన్ని తీసుకోని దానిని తన సెల్‌ఫోన్ ద్వారా ఫోటోను తీసుకున్నాడు. అనంతరం నిందితుడు తన సెల్‌ఫోన్‌లోని హిందీ ప్రశ్నపత్రం ఫోటో ను మరో నిందితుడైన మౌటం శివ గణేషు వాటప్స్ నంబర్‌కు పోస్ట్ చేశారు. అనంతరం రెండో నిందితుడైన మౌటం శివ గణేష్ ఉదయం 9.59 నిమిషాలకు తన సెల్ ఫోన్ ద్వారా ఎస్.ఎస్.సి 2019-20 అనే వాటప్స్ గ్రూప్‌కు ఫార్వడ్ చేయగా, మూడవ నిందితుడు ప్రశాంత్ సెల్ ఫోన్ ఎస్.ఎస్.సి 2019-20 గ్రూప్ నుండి ప్రశ్న పత్రం రావడంతో ఈ ప్రశ్న పత్రాన్ని నిందితుడు ప్రశాంత్ వివిధ గ్రూపులకు ఫార్వర్డ్ చేసాడు.

దీనితో సదరు ప్రశ్న పత్రం వివిధ వాట్సప్ నంబర్కు ఫార్వర్డ్ కావడంతో మంగళవారం నిర్వహించిన హిందీ పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రం వాట్సప్ లో చక్కర్లు కొట్టింది. ఈ విషయం పై విద్యా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు సైబర్ విభాగంతో పాటు స్థానిక పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నిందితులను గుర్తించారు.

నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన కాజీపేట ఏసిపి శ్రీనివాస్, ఏసిపి తిరుమల్, సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, కమలాపూర్ ఇన్స్పెక్టర్ సంజీవ్, కమలాపూర్ ఎస్.ఐలు చరణ్, సతీష్, హసన్పర్తి ఎస్.ఐ విజయ్ సతీష్, సైబర్ క్రైమ్ విభాగం ఏఏఓ ప్రశాంత్, కానిస్టేబుళ్ళు కిషోర్, రాజు, ఆంజనేయులు లను వరంగల్ పోలీస్ క‌మిషనర్ అభినందించారు.