185 మంది రైతుల ఆత్మహత్యలు.. 20లక్షల ఎక­రాల్లో ఎండిన పంటలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెలకొన్న సాగునీటి కొరత నేపథ్యంలో 20లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోగా, కష్టనష్టాలకు గురైన 185మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు

  • By: Somu    latest    Mar 25, 2024 10:04 AM IST
185 మంది రైతుల ఆత్మహత్యలు.. 20లక్షల ఎక­రాల్లో ఎండిన పంటలు

రజాకార్లలా బ్యాంకు అధికారులు

రైతులను పరామర్శించే టైం లేదా?

మాజీ మంత్రి హరీ­శ్‌­రావు విమ­ర్శలు

విధాత : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెల­కొన్న సాగు­నీటి కొరత నేప­థ్యంలో 20 లక్షల ఎక­రాల్లో పంటలు ఎండి­పోగా, కష్ట­న­ష్టా­లకు గురైన 185 మంది రైతులు ఆత్మ­హ­త్యలు చేసు­కు­న్నా­రని మాజీ మంత్రి, బీఆరెస్‌ ఎమ్మెల్యే టీ హరీ­శ్‌­రావు విమ­ర్శిం­చారు. సోమ­వారం తెలం­గాణ భవ­న్‌లో ఆయన మీడి­యాతో మాట్లా­డారు. గత పదే­ళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరి­స్థితి ఎదు­రు­కా­లే­దని రైతులే చెబు­తు­న్నా­రని వ్యాఖ్యా­నిం­చారు. సాగు­నీరు లేదు.. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలి­యడం లేదని, ట్రాన్స్‌­ఫా­ర్మర్లు, మోటర్లు కాలి­పోతూ రైతులు మరింత నష్ట­పో­తు­న్నా­రని ఆందో­ళన వ్యక్తం చేశారు. రాష్ట్ర­మం­తటా రైతాంగం తీవ్ర ఆందో­ళ­నలో ఉంద­న్నారు. ఎండిన పంట­లకు తోడు పండిన కొద్ది­పాట పంటలు అకాల వర్షా­లతో దెబ్బ­తి­నగా, మిగతా పంటకు మద్దతు ధర మేరకు కొను­గోలు జరు­గని పరి­స్థితి నెల­కొం­ద­ని చెప్పారు.

‘రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్ళు అప్పుల గురించి నోటీ­సులు ఇస్తు­న్నారు. అప్పులు చెల్లిం­చా­లని రైతు­లను ఇబ్బంది పెడు­తు­న్నా­రు. బకా­యిలు కట్ట­క­పోతే ఆస్తులు జప్తు చేస్తా­మని బెది­రి­స్తు­న్నా­రు. రజా­కా­ర్లను తల­పిం­చేలా ప్రవ­ర్తి­స్తు­న్నా­రు’ అని హరీ­శ్‌­రావు ఆరో­పిం­చారు. రాష్ట్ర రైతాంగం ఇంత దారుణ స్థితిలో ఉంటే సీఎం రేవం­త్‌­రె­డ్డికి పట్టడం లేదని, ఇతర పార్టీల నుంచి చేరి­క­లపై తప్ప రైతుల గురించి ఆయ­నకు ఆలో­చన లేదని విమ­ర్శిం­చారు. రైతులు లక్షల రూపా­యలు ఖర్చు పెట్టి బోర్లు వేసినా నీళ్లు పడటం లేదని చెప్పారు. సీఎంకు, మంత్రు­లకు రైతు­లను పరా­మ­ర్శించి, భరోసా కల్పించే టైం కూడా లేదా అని ప్రశ్నిం­చారు. ప్రమా­ణ­స్వీ­కారం చేసిన తర్వాత తొలి సంతకం రుణ­మా­ఫీ­పైనే పెడ­తా­నని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అధి­కా­రం­లోకి వచ్చి 100రోజులు పూర్త­యినా దీనిపై నిర్ణయం తీసు­కో­లే­దని విమ­ర్శిం­చారు.

రైతు­లకు ఇచ్చిన 4 హామీలు ఇప్పటి వరకు అమలు చేయ­లే­ద­న్నారు. రైతు­లకు భరోసా కల్పిం­చేం­దుకు, వారి సమ­స్య­లపై పోరా­డేం­దుకు బీఆ­రెస్ శ్రేణులు రైతుల పొలాల వద్దకు వెళ్లి వారికి సంఘీ­భావం తెలు­పా­లని సూచి­స్తు­న్నా­మ­న్నారు. ఇప్ప­టి­కైనా ప్రభుత్వం రైతు­లకు భరో­సా­ని­చ్చేలా రైతు­లను ఆదు­కు­నేం­దుకు తక్ష­ణమే సమీక్ష నిర్వ­హించి సహా­య చర్యలు చేప­ట్టా­లని డిమాండ్ చేశారు. అలాగే 2లక్షల రుణ­మాఫీ చేప­ట్టా­లని, నిర్బంధ రుణ వసూ­ళ్లను ఆపా­లని, రైతు­బంధు డబ్బులు వెంటనే రైతు­లకు అందిం­చా­లని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందో­ళ­నలు నిర్వ­హి­స్తా­మని చెప్పారు.