Nalgonda | విధాత: దేవరకొండ నియోజకవర్గం పరిధిలో సాగుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఒకవైపు జనం పెద్ద ఎత్తున హాజరవుతున్నా.. మరోవైపు నియోజకవర్గం కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతిస్తున్నాయి. ఇప్పటికే రెండు పర్యాయాలు పాదయాత్రలో తన్నులాటకు దిగిన బాలు నాయక్ కిషన్ నాయక్ వర్గీయులు ఆదివారము రాత్రి కొండమల్లేపల్లి కార్నర్ మీటింగ్ సభ వేదికపై భట్టి సమక్షంలోనే మైక్ కోసం గలాటకు దిగారు. బాలు నాయక్ ఒకవైపు కిషన్ […]
Nalgonda |
విధాత: దేవరకొండ నియోజకవర్గం పరిధిలో సాగుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఒకవైపు జనం పెద్ద ఎత్తున హాజరవుతున్నా.. మరోవైపు నియోజకవర్గం కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతిస్తున్నాయి.
ఇప్పటికే రెండు పర్యాయాలు పాదయాత్రలో తన్నులాటకు దిగిన బాలు నాయక్ కిషన్ నాయక్ వర్గీయులు ఆదివారము రాత్రి కొండమల్లేపల్లి కార్నర్ మీటింగ్ సభ వేదికపై భట్టి సమక్షంలోనే మైక్ కోసం గలాటకు దిగారు.
బాలు నాయక్ ఒకవైపు కిషన్ నాయక్ మరోవైపు మైకు లాక్కుంటూ తోపులాట కొద్దిగా బట్టి తో పాటు సభకు హాజరైన జనం కార్యకర్తలు విస్మయానికి లోనయ్యారు. పాదయాత్రలో మరోసారి స్థానిక కాంగ్రెస్ నేతలు బాబాయికి దిగిన ఘటనతో భట్టి అసహనానికి గురయ్యారు.
బాలునాయక్ మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ టిక్కెట్ ను ఆశిస్తున్న కిషన్ నాయక్ ఆయనతో మైక్ కోసం బాహబాహికి దిగారు. దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు బాలునాయక్, రవి నాయక్, కిషన్ నాయక్, బిల్యా నాయక్, రవినాయక్ వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం భట్టికి సైతం ఆగ్రహం తెప్పించింది.
అలాగే సభ వేదిక పైకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిన సందర్భంలో సీఎం సీఎం అంటూ కార్యకర్తలు కేకలు వేయగా, భట్టి వారిని వారించి సోనియా గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్,చేయి గుర్తుకే మన ఓటు అని మాత్రమే నినాదించాలని సూచించారు.