లోకేశ్‌ పాదయాత్రలో విషాదం: తార‌క‌ర‌త్న‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. బ్లూ క‌ల‌ర్‌లోకి శరీరం

Nandamuri Tarakaratna | తెలుగు దేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌లో అప‌శృతి చోటు చేసుకుంది. కుప్పం స‌మీపంలోని శ్రీవ‌ర‌ద‌రాజ స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం లోకేష్ పాద‌యాత్ర ప్రారంభ‌మైంది. ఈ యాత్ర నంద‌మూరి తార‌క‌ర‌త్న కూడా పాల్గొన్నారు. అయితే యాత్ర ప్రారంభ‌మైన కాసేప‌టికే తార‌కర‌త్న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో చికిత్స నిమిత్తం అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మొద‌ట ప‌ల్స్ పూర్తిగా ప‌డిపోయాయి. శ‌రీరం పూర్తిగా బ్లూ క‌ల‌ర్‌లోకి మారిపోయింద‌ని […]

  • Publish Date - January 27, 2023 / 07:57 AM IST

Nandamuri Tarakaratna | తెలుగు దేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌లో అప‌శృతి చోటు చేసుకుంది. కుప్పం స‌మీపంలోని శ్రీవ‌ర‌ద‌రాజ స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం లోకేష్ పాద‌యాత్ర ప్రారంభ‌మైంది. ఈ యాత్ర నంద‌మూరి తార‌క‌ర‌త్న కూడా పాల్గొన్నారు.

అయితే యాత్ర ప్రారంభ‌మైన కాసేప‌టికే తార‌కర‌త్న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో చికిత్స నిమిత్తం అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మొద‌ట ప‌ల్స్ పూర్తిగా ప‌డిపోయాయి. శ‌రీరం పూర్తిగా బ్లూ క‌ల‌ర్‌లోకి మారిపోయింద‌ని వైద్యులు తెలిపారు.

45 నిమిషాల త‌ర్వాత ప‌ల్స్ మొద‌లైంద‌న్నారు. ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని ఆశిస్తున్నామ‌ని వైద్యులు చెప్పారు. బెట్ట‌ర్ ట్రీట్‌మెంట్ కోసం య‌త్నిస్తున్నామ‌ని పేర్కొన్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం బెంగ‌ళూరుకు త‌ర‌లించే అవ‌కాశం ఉంది.