ప్రధాని మోడీ మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లను సాధించే లక్ష్య సాధన కోసం ఇప్పటిదాక బీజేపీ ఎక్కువ సీట్లు గెలవని రాష్ట్రాల్లో ఈ దఫా గట్టి ప్రయత్నం చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది.
విధాత, హైదరాబాద్ : ప్రధాని మోడీ మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి 4న ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం 12గంటలకు బీజేపీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం అదిలాబాద్ నుంచి నాంధేడ్కు మోడీ బయలుదేరుతారు. అదే రోజు రాత్రి హైదరాబాద్కు చేరుకుని రాజ్భవన్లో బస చేస్తారు. తిరిగి 5వ తేదీన సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభిస్తారు.
అనంతరం మధ్యాహ్నం సంగారెడ్డి బహిరంగ సభలో పాల్గొని, మధ్యాహ్నం 2.40కి ఒరిస్సా వెలుతారు. పార్లమెంటు ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లను సాధించే లక్ష్య సాధన కోసం ఇప్పటిదాక బీజేపీ ఎక్కువ సీట్లు గెలవని రాష్ట్రాల్లో ఈ దఫా గట్టి ప్రయత్నం చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తెలంగాణలో గత పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన నాలుగు స్థానాలను తిరిగి గెలుచుకోవడంతో పాటు అదనంగా మరికొన్ని సీట్లు గెలుచుకోవాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఇందుకోసం మోడీ తెలంగాణలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో బీజేపీ పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని మోడీ అదిలాబాద్ జిల్లాలో ఈ నెల 4వ తేదీన పూరించనున్నారు.