మీ పతనానికి రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది కొత్తగూడెం వేదికగా తిరుగుబాటు మొదలైంది రాత్రంతా చెప్పినా తెలంగాణ గోడు తీరదు - మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ బయలుదేరాడు- జూపల్లి కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనం విజయవంతం విధాత బ్యూరో, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యుడు (Ponguleti Srinivasa Reddy) పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనాని (Athmeeya Sammelanam)కి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. […]
విధాత బ్యూరో, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యుడు (Ponguleti Srinivasa Reddy) పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనాని (Athmeeya Sammelanam)కి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా పొంగులేటి, జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) మాట్లాడుతూ రాత్రంతా చెప్పినా తెలంగాణ ప్రజల గోడు తీరదని సీఎం కేసిఆర్ ని ఎద్దేవా చేశారు. ఎందరో అమరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను ఆయన తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణ వస్తే కావాలి కుక్కలా ఉంటానని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ (kcr)రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణని చేసారని విమర్శించారు.
జూపల్లి ప్రత్యేకంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోదని భారత రాష్ట్ర సమితి పేరుతో దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరారని అన్నారు. పొంగులేటి వెంట రావడానికి సిద్ధపడ్డ సర్పంచులను ప్రజా ప్రతినిధులకు నిధులు ఇవ్వమంటూ బెదిరింపులకు పాల్పడడం హేయమైన చర్యని అన్నారు. కేసిఆర్ పాలనలో ప్రజాస్వామ్యం అణచి వేయబడుతుందని అందుకే పొంగులేటితో చేతులు కలిపానని అన్నారు.
తెలంగాణను దోచుకుంటున్న దుర్మార్గుడు కేసీఆర్ అని,కొత్తగూడెం వేదికగా ఆయన పతనం మొదలైందని అన్నారు. తెలంగాణ సాధన కోసం పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రగతి భవన్ తలుపులు ఎందుకు తెరచుకోవని ప్రశ్నించారు. 12వేల గ్రామపంచాయతీలను మోసం చేసిన ఘనత కేసిఆర్ దేనని అన్నారు.17 లక్షల మందికి దళిత బంధు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇంతవరకు ఎంతమందికి దళిత బంధు ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు.
ఈ ఆత్మీయ సమ్మేళనం వేదికగా రాష్ట్ర మొత్తం ఖమ్మం వైపు చూస్తుందని రానున్న ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారధ్యంలో ఖమ్మం జిల్లా పదికి పది స్థానాలు సాధించి కేసీఆర్ కి గుణపాఠం చెప్పాలని జిల్లా ప్రజలకు జూపల్లి పిలుపునిచ్చారు.
అనంతరం పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy)మాట్లాడుతూ.. కొత్తగూడెం వేదికగా అసలు ఉద్యమం ఇప్పుడే మొదలైందని,పోరాడి సాధించుకున్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్ కు త్వరలోనే రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు.
కేసీఆర్ తన కుటుంబం కోసం తెలంగాణను తాకట్టు పెట్టారని, రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన కేసీఆర్ కు వ్యతిరేకత మొదలైందని అర్థమై భారత రాష్ట్ర సమితిని స్థాపించి దేశ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరాడని అన్నారు. ప్రజల కోసం కాకుండా కుటుంబం కోసం తెలంగాణ(telangana) ను తాకట్టు పెట్టావు కదా కేసీఆర్ అందుకే నిన్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలా అని ప్రశ్నించారు.
8 సంవత్సరాల పాలనలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి సాధించింది ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అమరులకు 10 లక్షల రూపాయలు, ఇంటికో ఉద్యోగం అన్నావు ఎంతమందికి ఇచ్చావని ప్రశ్నించారు.
ధనిక రాష్ట్రాన్ని సుమారు 5లక్షల కోట్ల రూపాయల అప్పులపాలు చేసిన ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అవుదామని కలలు కంటున్నావకంటున్నారని, అది సాధ్యం కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు.
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు.
దళిత బంధు పేరిట దళితులను మోసం చేస్తున్నారు, దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు ఈ హామీలన్నీ ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. మీ పతనానికి రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది..కొత్తగూడెం వేదికగా తిరుగుబాటు మొదలైందని హెచ్చరించారు.