Revanth Reddy | సీఎం కేసీఆర్ది.. 30% కమీషన్ సర్కార్
Revanth Reddy థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో 15 వేల కోట్ల దోపీడీ 24 గంటల విద్యుత్తుపై రైతు వేదికల్లో చర్చకు రెడీ ఈ సవాలుకు మంత్రి కేటీఆర్ సిద్ధమా? 24 గంటలు ‘సింగిల్ ఫేజ్। అని సీఎండీ చెప్పారు ఉచిత విద్యుత్తు ముసుగులో కేసీఆర్ అవినీతి దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్కు వ్యవసాయం తెలియదు రాహుల్పై వ్యాఖ్యలకు నిరసగా కేటీఆర్ను నిలదీయండి మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విధాత : తెలంగాణలో థర్మల్ […]

Revanth Reddy
- థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో 15 వేల కోట్ల దోపీడీ
- 24 గంటల విద్యుత్తుపై రైతు వేదికల్లో చర్చకు రెడీ
- ఈ సవాలుకు మంత్రి కేటీఆర్ సిద్ధమా?
- 24 గంటలు ‘సింగిల్ ఫేజ్। అని సీఎండీ చెప్పారు
- ఉచిత విద్యుత్తు ముసుగులో కేసీఆర్ అవినీతి
- దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్కు వ్యవసాయం తెలియదు
- రాహుల్పై వ్యాఖ్యలకు నిరసగా కేటీఆర్ను నిలదీయండి
- మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
విధాత : తెలంగాణలో థర్మల్ పవర్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ది 30 శాతం కమీషన్ తీసుకునే సర్కార్ అని ఆరోపించారు. 24 గంటల ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉందన్నారు. కేటీఆర్ సిద్ధమా అని సవాలు విసిరారు. “కేటీఆర్ ఏ రైతు వేదికకు వస్తాడో చెబితే నేనూ అక్కడికి వస్తా.. సిరిసిల్ల, చింతమడక, గజ్వేల్ రైతు వేదికల్లో ఎక్కడికి రావాలో చెప్పాలి. 24 గంటల కరెంటుపై ఆధారాలతో సహా ఇద్దరం చర్చిద్దాం” అని రేవంత్ రెడ్డి చెప్పారు.
అవినీతి కోసమే పవర్ప్లాంట్లు
“కేటీపీఎస్, యాదాద్రి, భద్రాద్రి మూడు థర్మల్ ప్రాజెక్టులు కలిపి రూ.45 వేల730 కోట్లకు టెండర్లు పిలిచారు. ఇందులో 30శాతం కేసీఆర్ కమీషన్ కొట్టేశారు. ఇది 30 శాతం కమీషన్ సర్కార్. టెండర్లలో రూ.15వేల కోట్లు నొక్కిన దొంగ కేసీఆర్” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉచిత కరెంటును ప్రభుత్వం అవినీతికి వాడుకుంటోందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్తు అందిస్తానని చెప్పినా పట్టించుకోకుండా కేసీఆర్ అవినీతి కోసం థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారన్నారు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను ప్రోత్సహించడం ద్వారా అవసరానికి మించి విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలోనేనని తెలిపారు. తెలంగాణలో కరెంట్ కొరత ఉందని, థర్మల్ ప్రాజెక్టుల ద్వారా సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని కబుర్లు చెప్పి, అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు.
ఇదీ అవినీతి..
“కేటీపీఎస్ 2015లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రూ.5,280 కోట్లకు టెండర్ పిలిచారు. ఉత్తరాఖండ్ లో 2,400 థర్మల్ పవర్ ఉత్పత్తికి రూ.14వేల కోట్లకు టెండర్ పిలిచింది. ఒక మెగావాట్ విద్యుత్ రూ.5 కోట్ల 50 లక్షలకు ఉత్పత్తి చేయొచ్చని బీహెచ్ ఈఎల్ టెండరు దక్కించుకుంది. తెలంగాణలో ఎన్టీపీసీ 1600 మెగావాట్ల ఉత్పత్తికి రూ.10,997 కోట్లకు టెండరు పిలిచారు. రూ.6 కోట్ల 80 లక్షలకే ఒక మెగావాట్ ఉత్పత్తి చేసేలా టెండరు వేసింది.
సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని 2011-12లో చట్టం తెచ్చింది. గుజరాత్ ఇండియా బుల్స్ వద్ద కేసీఆర్, కేటీఆర్ వెయ్యి కోట్లు లంచం తీసుకుని సబ్ క్రిటికల్ టెక్నాలజీని తెచ్చుకున్నారు. దీన్ని రూ.7,290 కోట్లకు బీహెచ్ఈఎల్ కు అప్పగించారు…1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు టెండరు విలువ పెంచి… ఒక మెగావాట్ ఉత్పత్తి చేసేందుకు రూ.9కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కేసీఆర్ అవినీతి వల్ల కేటీపీఎస్ రూ.945కోట్లు, భద్రాద్రి రూ.4,538 కోట్లు, యాదాద్రి రూ.9,384 కోట్ల నష్టం జరిగింది.
మూడు ప్రాజెక్టులు కలిపి రూ.45 వేల730 కోట్లకు టెండరు పిలిచారు. ఇందులో 30శాతం కేసీఆర్ కమీషన్ కొట్టేశారు.ఇది 30 శాతం కమీషన్ సర్కార్. టెండర్లలో రూ.15వేల కోట్లు నొక్కిన దొంగ కేసీఆర్” అని రేవంత్రెడ్డి చెప్పారు. బీహెచ్ఈఎల్ కేవలం ఎలక్ట్రిక్ పనులు మాత్రమే చేస్తుందని, ప్లాంట్ల నిర్మాణంలో సివిల్ పనులు చేయదని అన్నారు. అటువంటి సివిల్ పనులను కేసీఆర్ తన అనుయాయులకు అప్పగించారని ఆరోపించారు.
ప్రజలు అవినీతి గురించి ప్రశ్నిస్తారనే కేసీఆర్ బీహెచ్ఈఎల్ను ముందుకు తెచ్చారని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి ఏ ధరకు ఏయే కంపెనీలకు పనులు అప్పగించారో బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ను, తనను తిట్టకుండా బీఆరెస్ నేతలకు రోజు గడవడం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇన్నాళ్లు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆరెస్ బుకాయిస్తూ వచ్చిందని, కానీ 24 గంటల విద్యుత్ సింగిల్ ఫేజ్ అని సీఎండీ ప్రభాకర్ రావు జనవరి 30న చెప్పిన రేవంత్ ప్రస్తావించారు. ఇవాళ కూడా 24గంటల కరెంటుపై జర్నలిస్టులు ప్రశ్నిస్తే ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయారని అన్నారు.
నా వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం
‘ఉచిత విద్యుత్తును, ప్రజల సెంటిమెంట్ను స్వార్థం కోసం కేసీఆర్ వాడుకోకూడదని తానా వేదికగా స్పష్టంగా చెప్పాను. దాన్ని తప్పుడు ప్రచారం చేసి రాద్ధాంతం చేస్తున్నారు. ఉచిత కరెంట్ పై పేటెంట్ కాంగ్రెస్ది అయితే.. అసలు కాంగ్రెస్సే కరెంట్ ఇవ్వలేదన్నట్లుగా మాట్లాడి.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ఇలా కేటీఆర్ ఒకటే గంతులేస్తున్నారు.
మూడు గంటలు కావాలా.. మూడు పంటలు కావాలా అని రచ్చ చేస్తున్నారు. ఆరు పెగ్గులు కావాలా.. లేకుంటే ఫుల్ బాటిల్ కావాలా..? రైతు వేదికల్లో చర్చ పెడదాం.. కేటీఆర్ ఎక్కడ చర్చ పెట్టినా సరే.. నేను కూడా వస్తాను. ఉచిత కరెంట్ ఇవ్వలేదన్నది నిరూపించాం.. ఇప్పుడు కూడా ఆ మాటకు నేను కట్టుబడే ఉన్నాను. మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి నిరూపించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 3,500 సబ్ స్టేషన్లలోని లాగ్ బుక్కులను సీజ్ చేసింది.
తెల్ల కాగితాలపై రాసుకునే పరిస్థితి వచ్చిందంటే.. ప్రభుత్వం కరెంట్ను ఏవిధంగా అవినీతికి వాడుకుంటోందో ప్రజలకు గమనించాలి’ అని రేవంత్ చెప్పారు. విద్యుత్తు కొనుగోలు పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘దొంగ లెక్కలు చూపించి, రూ.8 నుంచి 9వేల కోట్లు దోచుకుంటున్నారు. ఈ డబ్బులు ఎక్కడికెళ్తున్నాయ్..? దీని మీద విచారణ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా..?’ అని ప్రశ్నించారు.
కేటీఆర్ను అడ్డుకోండి
రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘అసలు కేటీఆర్ కు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్కు వ్యవసాయం తెలియదు’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ పై వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
24 గంటల విద్యుత్ ఇచ్చే వరకు రైతు వేదికలకు తాళం పెట్టి నిరసన తెలపాలని, రుణమాఫీ, పోడు భూముల పట్టాలు, 24 గంటల కరెంటు ఇచ్చే వరకు.. బీఆరెస్ ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేసి నిలదీయాలని రైతులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
BJP, BRS చీకటి మిత్రులు
“బీజేపీ, బీఆరెస్ చీకటి మిత్రులు. వారిద్దరిదీ ఫెవికాల్ బంధం. కేసీఆర్ నాయకత్వంపై హరీష్ రావుకు విశ్వాసం ఉంటే.. కేసీఆర్ ఈసారి మళ్లీ గజ్వేల్ లో పోటీ చేయాలి. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి. కేసీఆర్ పాలనకు ఇదే రెఫరెండం లాంటిది. మూడోసారి అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ కు గజ్వేల్ లో పోటీ చేయడానికి భయం ఎందుకు? సిట్టింగులకు సీట్లు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారు?’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు