RS Praveen Kumar బిల్లులు ఎత్తుకొని, బ్రిడ్జి కట్టడం మరిచారు. 70 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు. బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు విద్య అందించడంలో విఫలమైంది. విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో గల పెద్దవాగుపై నిర్మించిన అందెల్లి బ్రిడ్జి కూలిపోయి సంవత్సర కాలం గడుస్తున్న స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరమ్మతులు చేయించడం లేదని,కోట్ల రూపాయల బిల్లులు ఎత్తుకొని బ్రిడ్జి నిర్మించలేదని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ […]
RS Praveen Kumar
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో గల పెద్దవాగుపై నిర్మించిన అందెల్లి బ్రిడ్జి కూలిపోయి సంవత్సర కాలం గడుస్తున్న స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరమ్మతులు చేయించడం లేదని,కోట్ల రూపాయల బిల్లులు ఎత్తుకొని బ్రిడ్జి నిర్మించలేదని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా,అందెల్లి బ్రిడ్జిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తాత్కాలిక రోడ్డు వేయించి,బిల్లులు తీసుకొని చేతులెత్తేశారని,కొంత కాలానికే ఆ రోడ్డు పాడైపోయిందని తెలిపారు .ఈ కాగజ్ నగర్ నుండి దహెగాం,పెంచికల్ పేట మండలాలకు చెందిన దాదాపు 70 గ్రామాలకు రాకపోకలు స్తంభించిందన్నారు.
ప్రజలు అత్యవసర సమయంలో రవాణా సౌకర్యాలు లేక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రజలు అత్యంత ప్రమాదకర పరిస్థితి లో వాగు దాటుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఫాంహౌస్ కీ ,ఎమ్మెల్యే ఇంటికి 80 ఫీట్ల రోడ్డు వేయించుకునే పాలకులు పేదలకు మాత్రం రవాణా సౌకర్యాలు ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు.
యాభై ఏళ్లుగా పాలకులు ఇలాగే పేదలకు చెందాల్సిన సొమ్మును అక్రమంగా దోపిడీ చేస్తున్నారని, కమీషన్ల కోసం నాసిరకం పనులు చేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పజెప్పుతున్నారని విమర్శించారు. ఇలాంటి దోపిడీ ప్రభుత్వం,కబ్జాకోరుల,గుండాగిరి చేసే దొంగల ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. కేవలం బహుజన రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.
కాగజ్ నగర్ పట్టణంలోని బాలభారతి పాఠశాలను సందర్శించారు. గత 65 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత చదువులు చెప్పి ప్రయోజకులను,ఆఫీసర్లను అందించిన బాలభారతి పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మూసేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆ స్థలాన్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేకులని విమర్శించారు.
ఎమ్మెల్యే అనుచరులు పేదల కోసం నడుస్తున్న పాఠశాలకు కరెంట్,నీళ్లు కట్ చేయడం, టీచర్లను వేధించడం దారుణమన్నారు, వేధింపులకు గురిచేస్తున్నవారిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమన్నారు. పేద బిడ్డలకు చదువు అందాలన్నా,విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలన్నా బహుజన రాజ్యం రావాలన్నారు. బాలభారతి పాఠశాలను బహుజన రాజ్యంలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి,ఉత్తర తెలంగాణ చేరిక కమిటీ ఇంచార్జి అర్షద్ హుస్సేన్,రాష్ట్ర నాయకులు సీడం గణపతి,నియోజకవర్గ అధ్యక్షులు రాం ప్రసాద్,నియోజకవర్గ నాయకులు నక్క మనోహర్, ప్రవీణ్,షేక్ చాంద్ తదితరులు పాల్గొన్నారు.