రష్యా దేశంలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరుగుతుందని భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలువురు భారతీయులు మోసపోయి
విధాత : రష్యా దేశంలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరుగుతుందని భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలువురు భారతీయులు మోసపోయి రష్యా-ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్నారని తెలిపింది. ఏజెంట్లు రష్యాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసాలకు పాల్పడి వారిని రష్యా ప్రైవేటు సైన్యంలో చేర్పిస్తున్నట్లుగా గుర్తించామని వెల్లడించింది. రష్యా ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న భారతీయులను గుర్తించి వెనక్కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. మోసపూరిత మాటలతో రష్యా ప్రైవేట్ సైన్యంలో చేర్చుతున్న ఏజెంట్లను సీబీఐ గుర్తించిందని, దేశవ్యాప్తంగా జరిపిన సోదాలు దాడుల్లో అక్రమ రవాణా నెట్వర్క్ బయటపడిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. పలువురు ఏజెంట్ల పై సీబీఐ కేసులు నమోదు చేసిందని, ఏజెంట్ల మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని, అటువంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే ఏజెంట్ల మోసాలతో రష్యా ఆర్మీకి సహాయకంగా ఉన్న ప్రైవేటు ఆర్మీలో బలవంతంగా చేర్చబడిన గుజరాత్కు చెందిన సూరత్ వాసి హామిల్ మంగుకియాగా, హైదరాబాద్ వాసి మహ్మద్ అఫ్సాన్లు మరణించిన విషయం విదితమే.