విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్, హనుమకొండ సీఐటీయు (CITU) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గురువారం వేర్వేరుగా టెన్ కె వాక్ ఫర్ సోషల్ జస్టిస్ పాదయాత్రను వరంగల్ నగరంలో నిర్వహించారు. వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంజీఎం సెంటర్ నుండి వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు జరిగింది. హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ వరకు ఈ టెన్ కే వాక్ నిర్వహించారు. సామాజిక సమానత్వం కోసం ఉద్యమించాలి సమాజంలో నెలకొన్న సామాజిక […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్, హనుమకొండ సీఐటీయు (CITU) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గురువారం వేర్వేరుగా టెన్ కె వాక్ ఫర్ సోషల్ జస్టిస్ పాదయాత్రను వరంగల్ నగరంలో నిర్వహించారు. వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంజీఎం సెంటర్ నుండి వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు జరిగింది. హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ వరకు ఈ టెన్ కే వాక్ నిర్వహించారు.
సామాజిక సమానత్వం కోసం ఉద్యమించాలి
సమాజంలో నెలకొన్న సామాజిక అనుచివేతలకు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సమాజంలో అనేక సమానతలు దాగి ఉన్నాయి అని వీటివల్ల పలువురు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సమాజానికి సమానత సందేశాన్ని అందించేందుకు టెన్ కె వాక్ చేపట్టినట్టు సిఐటియు నాయకులు వివరించారు.
ఈ కార్యక్రమం అనంతరము ఏఈఓ శ్రీకాంత్కు సిఐటి యూ బృందం వినతి పత్రం అందజేసింది.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సాగర్, జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి, రాగుల రమేష్, ఎం.చుక్కయ్య, జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎండి మహబూబ్ బాషా అక్కెనపల్లి యాదగిరి జన్ను ప్రకాష్, షాజియా, రాధిక, గున్నాల ప్రభాకర్, ఓదెలు, ఉపేందర్, యాకూబ్ భాష, దివ్య, అప్పాజీ, వాణి, జుబేదా, కిరణ్, రంజాన్, రాఘవరెడ్డి, పెంటయ్య, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.