ఉస్మానియూ యూనివర్సిటీలో ఉద్రిక్తత

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ

  • Publish Date - March 3, 2024 / 10:44 AM IST

పీఈటీ నిరుద్యోగుల నిరసన దీక్ష భగ్నం

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో పీఈటీ పోస్టులను పెంచాలని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తూ ఓయూలోని ఆర్ట్స్ కళాశాల ముందు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దీక్షా ప్రాంతానికి చేరుకుని విద్యార్థులను అక్కడి నుంచి ఖాళీ చేయాలని సూచించారు. విద్యార్థులు అందుకు ససేమిరా అనడంతో ఓయూ పీఎస్ పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషస్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య కొంత తోపులాట సాగింది. ఉద్యోగాల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాపాలన కాదని, దగా పాలన అని విద్యార్థి నాయకులు నుండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.