ఈ నెల 18న హైదరాబాద్లో మహాధర్నా రౌండ్ టేబుల్ సమావేశంలో టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: TSPSCని ప్రక్షాళన చేయాలి, TSPSC కేసుపై సిట్టింగ్ హై కోర్ట్ జడ్జి చేత విచారణ చేపట్టాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ నెల 18 న హైదరాబాద్లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపడతామన్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: TSPSCని ప్రక్షాళన చేయాలి, TSPSC కేసుపై సిట్టింగ్ హై కోర్ట్ జడ్జి చేత విచారణ చేపట్టాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ నెల 18 న హైదరాబాద్లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపడతామన్నారు.
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం ప్రసంగించారు. ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్, జిల్లా నాయకులు అప్పా రావు పాల్గొని మాట్లాడారు.
సమావేశంలో వారు మాట్లాడుతూ 2013 -2014 నుండి 2018- 2019 మధ్యకాలంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగింది. తెలంగాణలో మూడు రెట్లు పెరిగింది. పిజి విద్య పూర్తి చేసిన వారిలో 2013 -2014 పది శాతం నిరుద్యోగులైతే 2018- 2019లో 34 శాతం నిరుద్యోగులుగా ఉనారు. ఆంధ్ర పాలకులు మనకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నారనే కదా కోట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. ఎంతమంది విద్యార్థులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపలేదు. 2015లో ఆసెంబ్లీలో కే.సి.ఆర్ తెలంగాణల ఒక లక్ష 7 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం ఖాళీలు నింపుతామని అన్నారు. క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని, మూడు లక్షల చిల్లర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నిపుణులైన వారి ఆధ్వర్యంలో పరీక్షలు సక్రమంగా జరపాలన్నారు.
కేటిఆర్ ప్రశ్న పత్రాల కేసులో ఇద్దరే దోషులు అని ప్రకటించాడు, అందరూ సత్యమూర్తులేనా.. మరి అందుకే ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలి. ప్రతి విద్యార్థి లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్నాడు కాబట్టి పరీక్ష వ్రాసిన ప్రతి విద్యార్థికి లక్ష రూపాయలు ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎం.పి. సిరిసిల్ల రాజయ్య, CPI న్యూ డెమోక్రసీ నాయకులు మంద శంకరయ్య, నాగేశ్వర్ రావు, మహబూబ్ ఖాన్, మందల వెంకన్న, డాక్టర్ విజయ్, PDSU రాష్ట్ర కార్యదర్శి నరసింహా రావు, TJAC నాయకులు శ్రీనివాస్, BSP వరంగల్ ఉమ్మడి జిల్లా అద్యక్షుడు కన్నం సునీల్, విద్యావంతుల వేదిక నాయకులు జగపతి రావు, అఖిల భారత రైతు సంఘం నాయకులు మొగిలి ప్రతాప్, BSP పార్టీ జిల్లా అధ్యక్షులు మంద శ్యాం, సబ్యులు ధనరాజ్, PDSU వరంగల్ అద్యక్షులు రంజిత్ కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వేణుగోపాల్. CPIML నాయకులు పి.చంద్రన్న, TSJAC నాయకులు ఎం. మహేష్, NSUI జిల్లా అధ్యక్షులు పల్లకొండ్ సతీష్, NSUI నాయకులు నాగరాజు, చింకు, KU పొలిటికల్ సైన్సు డాక్టర్ కే. వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.