విధాత :తిరుమల శ్రీవారి నవ రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహించారు.
రాత్రి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో సూర్య, చంద్ర ప్రభ వాహనాల్లో విహారించిన స్వామివారిని దర్శించుకుని భక్తులు పులకించారు. ఉత్సవాల్లో టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.